బిజినేపల్లి, నవంబర్ 9 : రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ సం క్షేమ పథకాలు అందుతున్నాయని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని వడ్డెమాన్ గ్రామంలో రూ.కోటితో నిర్మించనున్న సీసీ రో డ్లు, పశువైద్యశాల, కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 57 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ, వితంతువు, వికలాంగుల పింఛన్లు రెండు నెలల్లో అందజేస్తామన్నారు. 24 గంటల కరెంట్ ఏ రాష్ట్రంలో లేదని, ఏదైనా రాష్ట్రంలో అందిస్తున్న ట్లు నిరూపిస్తే తాను రాజీనామాకు సిద్ధమన్నారు. సర్కారు రైతులకు మంచి చేస్తుంటే బీజేపీ కండ్లు మండి వ్యవసాయ బోర్ల వద్ద మీటర్లు పెట్టమని చెబుతున్నారని, కానీ బోరు మోటర్ల వద్ద మీటర్లు పెట్టబోమన్నారు. గతంలో వడ్డెమాన్ చెరువు నీరు లేక వెలవెలబోయేదని, కేఎల్ఐ కాలువ ద్వా రా ప్రతి ఏడాది నీటితో కళకళలాడడంతోపాటు చెరువు కిం ద వరి సాగు విస్తారంగా పెరిగిందన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు లక్షా 31,500 ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. గ త ఎన్నికల ముందు వడ్డెమాన్ గ్రామానికి రెండు కోట్లు ని ధులిస్తానని చెప్పగా.. అందులో భాగంగా రూ.కోటి నిధులను ఇప్పుడిచ్చి అభివృద్ధి పనులను ప్రారంభించినట్లు తెలిపారు. గ్రామ పంచాయతీకి ప్రతినెలా రూ.11 లక్షల నిధులు వస్తున్నాయన్నారు. ఇప్పటి వరకు రూ.2,28,56,456 రా గా.. రూ.63 లక్షలు మిగిలి ఉన్నాయన్నారు. గ్రామంలో అవసరం ఉన్న చోట సీసీ రోడ్లు, డ్రైనేజీలు వేయాలన్నారు. త్వరలోనే డబుల్బెడ్రూం ఇండ్లు, పింఛన్లు, బ్యాంక్ను ఏ ర్పాటు చేయిస్తామన్నారు. ఓ పక్క కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనేది లేదని చెబుతున్నదని, అయితే ధాన్యం కొనుగోలు చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లెటర్ తీసుకురావాలని సూచించారు. కాంగ్రెస్, బీజేపీలు పాదయాత్రలు చేపట్టడం సిగ్గుచేటన్నారు. వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు. అంతకు ముందు గ్రామంలోని నందీశ్వరాలయాన్ని సందర్శించి పూజలు చేశారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ కుర్మయ్య, ఎంపీపీ శ్రీనివాస్గౌడ్, వైస్ ఎంపీపీ చిన్నారెడ్డి, సర్పంచ్ సుదర్శన్గౌడ్, ఎంపీటీసీలు ఊశన్న, జ్యోతి, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పులేందర్రెడ్డి, మహేశ్వర్రెడ్డి, రాజేశ్, తిరుపతయ్య, ఎంపీడీవో రామ్మోహన్, బసవలింగం, ఏవో నీతి తదితరులు పాల్గొన్నారు.