మహబూబ్నగర్, నవంబర్ 9 : పోడు భూముల విషయంలో హక్కుదారులకు పూర్తిస్థాయిలో ఆధారాలు సేకరి స్తూ రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. మంగళవారం పట్టణంలోని తన క్యాం పు కార్యాలయంలో సంబంధింత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 8 నుంచి పోడు భూములకు సంబంధించిన అంశాలను అవగాహన కల్పించడంతోపాటు క్లెయిమ్స్ స్వీకరించాలని వివరించారు. అర్హత ఉన్న వారికి ఆర్ఓఆర్ కిం ద హక్కులు కల్పించిన విషయంపై ఇప్పటి వరకు గుర్తించి న గ్రామ పంచాయతీలు హాబిటేషన్లలో ఆర్వోఎఫ్ఆర్పై అ వగాహన గ్రామ సభల నిర్వహణ, తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోడు భూముల విషయంపై తాసిల్దార్లతో ప్రత్యేకంగా సమీక్షించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సీతారామారావు, డీఎఫ్వో గంగారెడ్డి, డీపీవో వెంకటేశ్వర్లు, డీటీవో చత్రు ఉన్నారు.
భూ సేకరణ వేగంగా చేపట్టాలి
కోయిల్సాగర్ ప్రాజెక్టు కింద భూ సేకరణ పనులను వెం టనే పూర్తి చేసి త్వరగా పనులు ప్రారంభించాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. కలెక్టర్ తన క్యాంపు కార్యాల యం నుంచి దేవరకద్ర ఎ మ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డితో కలిసి నిర్వహించిన వీసీ ద్వారా సమావేశం ని ర్వహించారు. గ్రావిటీ కె నాల్, లెఫ్ట్ కెనాల్కు సం బంధించిన భూ సేకరణ పై సమీక్షించారు. సాగర్ కింద 25 ఎకరాల భూమి ని సేకరించాల్సిన అవసరం ఉందని, ప్రాజెక్టు ఎస్ఈ నర్సింగ్రావు కలెక్టర్కు తెలియజేశారు. గ్రావిటీ కెనాల్కు సంబంధించి ప్రతిపాదనలు సమర్పించాల్సిన అవసరం ఉందన్నా రు. ఇప్పటికే పూర్తై డీఎన్డీడీని త్వరగా ప్రారంభించాలని కలెక్టర్ సూచించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీరాజ్, టీఎస్ఎంఐడీసీ, ట్రాన్స్కో, ఉద్యాన శాఖల ద్వారా చేపట్టిన పనుల టెండర్లపై కలెక్టర్ ఆయా శాఖల వారీగా సమీక్షా స మావేశం నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, మిషన్ భగీరథ ఎస్ఈ వెంకట్రెడ్డి, ఈఈ నరేందర్రెడ్డి, అధికారులు జైపాల్రెడ్డి, సాయిబాబా, స్వామి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
నేడు రాష్ట్ర మహిళా కమిషన్ రాక
రాష్ట్ర మహిళా కమిషన్ జిల్లాకు బుధవారం రానున్నట్లు కలెక్టర్ మంగళవారం తెలిపారు. మహిళా కమిషన్ అధ్యక్షురాలు వి.సునీతారెడ్డి అధ్యక్షతన కమిటీ సభ్యులు జిల్లాకు వస్తున్నారన్నారు. జిల్లా కేంద్రంలోని నర్సింగ్ మహిళ హా స్టల్, సఖీ కేంద్రాన్ని సందర్శిస్తారన్నారు. మహిళా సాధికారత, గృహ హింస, మహిళా ఉద్యోగినులు, పని చేసే చోట లైంగిక వేధింపులు అనే అంశంపై నిర్వహించే సెమినార్కు హాజరవుతారన్నారు. మహిళా ప్రజా ప్రతినిధులతో కమిటీ సభ్యులు సమావేశం నిర్వహిస్తారన్నారు.