నాగర్ కర్నూలు : తెలంగాణలో మూడు ఎస్సీ పార్లమెంట్ స్థానాల్లో అత్యధిక జనాభా గల మాదిగలకు కాంగ్రెస్ ఒక్క ఎంపీ స్థానం కేటాయించకుండా మోసం చేసిందని నాగర్ కర్నూలు పార్లమెంట్ బీఆర్ఎస్ (BRS) అభ్యర్ధి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (Praveen Kumar) ఆరోపించారు. నాగర్ కర్నూల్ పట్టణంలో మంగళవారం మాదిగల రాజకీయ ఐక్య వేదిక అధ్వర్యంలో నిర్వహించిన బహుజన మహనీయుల జయంతి ఉత్సవాల సభలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
పార్లమెంట్లో మాదిగ జాతికి ప్రాతినిధ్యం లేకుండా చేసి, మాదిగల గొంతు నొక్కడమేనని ఆరోపించారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా గల మాదిగలకు కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఇవ్వకుండా తీరని అన్యాయం చేసిందని ఐక్యవేదిక నాయకులు కాంగ్రెస్ (Congress) వైఖరిని ఖండించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు మాదిగలు ఎవరూ కూడా ఓటు వేయరని కోరారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు , ఎంపీటీసీ మంగి విజయ్ తదితరులు పాల్గొన్నారు.