నాగర్కర్నూల్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ) : కందనూలు కదంతొక్కింది.. అభిమానం ఉప్పొంగింది.. పల్లెలన్నీ కదిలాయి.. ప్రజలు తరలొచ్చారు.. జనం చేతుల్లో గులాబీ జెండాలు రెపరెపలాడాయి.. జై తెలంగాణ నినాదాలు మిన్నంటాయి.. దారులన్నీ గులాబీమయం అయ్యాయి.. పటాకుల మోతలు హోరెత్తాయి.. జై కేసీఆర్, జైజై బీఆర్ఎస్ నినాదా లు మార్మోగాయి.. ఉయ్యాలవాడ నుంచి మొదలైన బీఆర్ఎస్ రోడ్షోకు ప్రజలు నీరాజనం పలికారు.. దారిపొడవునా మహిళలు మంగళహారతులు పట్టారు.. అభిమాన నేత, గులాబీ దళపతిని కనులారా చూసేందుకు ప్రజలు వేలాదిగా తరలిరాగా పట్టణం జనసంద్రమైంది.. బస్టాండ్ వద్ద జరిగిన కార్నర్ మీటింగ్లో గులాబీ బాస్ ప్రసంగానికి జై కొట్టారు.. ప్రజలు ఫిదా అయిపోయి ఈ లలు, చప్పట్లతో మద్దతు తెలిపారు.. అధినేత దిశానిర్దేశంతో క్యాడర్లో నూతనోత్తేజం నిండింది.. పాలమూరు, నాగర్కర్నూల్ పా ర్లమెంట్ సెగ్మెంట్లలో జరిగిన బస్సు యాత్ర దిగ్విజయంగా ముగిసింది.
కందనూలులో కేసీఆర్ బస్సు యాత్రకు నీరాజనం పలికారు. జిల్లా కేంద్రం గులాబీమయమైంది. కిలోమీటర్ల పొడవునా పార్టీ శ్రేణులు, ప్రజలు ఘన స్వా గతం పలికారు. భారీ ఊరేగింపు అనంతరం మాజీ ఎమ్మెల్యే మర్రి ఆధ్వర్యంలో బస్టాండ్ వద్ద నిర్వహించిన కార్నర్ మీటింగ్లో చేసిన ప్రసంగం పార్టీ శ్రేణు ల్లో జోష్ నింపగా, ప్రజలను ఆలోచింపజేసింది.
కేసీఆర్ జైత్రయాత్ర..
నాగర్కర్నూల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బ స్సు యాత్ర జోష్గా సాగింది. మహబూబ్నగర్ నుంచి సాయంత్రం 6గంటల సమయంలో జిల్లా కేంద్రంలోని ఉయ్యాలవాడ వద్దకు చేరుకొన్నది. కేసీఆర్ వస్తుండటంతో సాయంత్రం 4గంటల నుంచే వేలాది మంది ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు జిల్లా కేం ద్రానికి చేరుకొన్నారు. ఉయ్యాలవాడ వద్ద కేసీఆర్కు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. బ్యాండ్ మేళాలు, షేర్బాజాలు, మహిళలు మంగళహారతులతో ఆహ్వానించారు. పటాకులు కాల్చారు. ప్రధాన రహదారి గులాబీ మయమైంది. పిల్లలు, మహిళలతోపాటు వృద్ధులు సైతం కేసీఆర్ను చూసేందుకు రోడ్లపైకి వచ్చారు. ఉయ్యాలవాడ నుంచి జిల్లా కేంద్రం వరకు దాదాపుగా గంటన్నరపాటు కేసీఆర్ బస్సు యాత్ర జరగ డం గమనార్హం. యువకులు, పార్టీ నాయకులు జై కేసీఆర్, జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. బస్టాండ్కు చే రుకున్న కేసీఆర్ను చూసిన వెంటనే వేలాది మంది పెద్దఎత్తున నినాదాలు చేస్తూ మద్దతు ప్రకటించారు.
భారీ గజమాలతో సన్మానం చేశారు. బస్సు నుంచి టాప్పైకి కేసీఆర్ చేరుకోగానే సీఎం సీఎం అంటూ పెద్ద ఎత్తున నినదించా రు. కేసీఆర్ ప్రసంగం ప్రారంభించగానే ప్రజలు నినాదాలతో హోరెత్తించారు. దాదాపుగా అరగంటపాటు సాగిన కేసీఆర్ ప్రసంగాన్ని ఆసాంతం ఆసక్తిగా విన్నారు. కేసీఆర్ ను బస్సులో నుంచి చూడగానే ప్రజలు చేయెత్తి నమస్కరించగా, ఇందుకు ఆయన రెండు చేతులతో అభివాదం చేస్తూ ముందుకు సాగారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు, మాజీ ఎమ్మెల్యేలు నాగం జనార్దన్రెడ్డి, బీరం హర్షవర్ధన్రెడ్డి తదితరులు కేసీఆర్తో మాట్లాడుతూ బస్సు యాత్రలో ఉయ్యాలవాడ నుం చి బస్టాండ్కు చేరుకొన్నారు. కాంగెస్ పాలనలో తులం బంగారం, కల్యాణలక్ష్మి వస్తుం దా.. రైతుబంధు అందరికీ వచ్చిందా.. మహిళలకు రూ.2,500 వచ్చాయా అనగా రాలేదంటూ అరుస్తూ, చేతులూపుతూ కేసీఆర్కు మద్దతు పలికారు. ఉద్యమ సమయంలో నాగర్కర్నూల్కు చాలా సార్లు వచ్చానని గుర్తుచేశారు. పదేండ్ల కాలంలో చేసిన అభివృద్ధి, కందనూలులో వచ్చిన మార్పును ప్రజలకు వివరించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని, ఆర్ఎస్ ప్రవీణ్లాంటి విద్యావంతుడు రాజకీయాల్లోకి రావడం మంచి పరిణామమని, ఇలాంటి గొప్ప వ్యక్తిని ఎంపీగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ బ స్సు యాత్ర కందనూలులో జోష్ను నింపింది. యువకు లు మెడపై గులాబీ కండువాలు వేసుకొని, జై కేసీఆర్ అం టూ ఊరేగింపులో సంబురంగా పాల్గొన్నారు.
పత్తాలేని పోలీస్ యంత్రాంగం
మహబూబ్నగర్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ ప్ర తినిధి) : ఉద్యమనేత, పదేండ్లపాటు తెలంగాణను పా లించిన కేసీఆర్ మహబూబ్నగర్లో బస చేస్తే పోలీస్ యంత్రాంగం తగిన భద్రత కల్పించకపోవడం స్పష్టంగా కనిపించింది. బస్సుయాత్ర సందర్భంగా మహబూబ్నగర్ పట్టణంలో ట్రాఫిక్ను కట్టడి చేయడంలో విఫలమయ్యారు. కేసీఆర్ కాన్వాయ్ పట్టణంలో ప్రవేశించినా పో లీసులు పెద్దగా పట్టించుకోలేదు. కేసీఆర్ మాజీ మంత్రి నివాసం వద్ద శుక్రవారం రాత్రి నుంచి శనివారం సా యంత్రం వరకు ఉన్నప్పటికీ పోలీసులు, సిబ్బంది ఎవరూ అటువైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం.
పోరాటంలో ప్రజలంతా గెలవాలి..
నడిగడ్డలో పుట్టిన నేను 26 ఏండ్లు రాష్ర్టానికి, దేశానికి సేవ చేశా. ఏడేండ్ల సర్వీసు మిగిలి ఉండగానే ప్రజాసేవ చేయాలనుకు న్న క్రమంలో పార్లమెంట్ అభ్యర్థిగా అవకాశం ఇచ్చిన కేసీఆర్కు ధన్యవాదాలు. అధినేత ఆశీర్వాదంతో నన్ను పార్లమెంట్కు పం పించండి. కేసీఆర్ పాలనలో, ఆయన మార్గదర్శంలో గురుకులాలను ప్రపంచపటంలో పెట్టాను. నాగర్కర్నూల్ గడ్డను పార్లమెంట్లో నిలిపే అవకాశం ఇవ్వండి. నిరంతరం మీ మధ్యలోనే ఉం టాను. నేను పార్లమెంట్కు పోతే నిరుద్యోగులు, రైతు కూలీలు, విద్యార్థులు అక్కడికి పోయినట్లే. కేసీఆర్ ఆశయానికి, రేవంత్రెడ్డి అహంకారానికి మధ్య జరుగుతున్న పోరాటమిది. కొండ చిలువలు ఓడిపోవాలి.. చలిచీమలమైన మనం గెలవాలి. తెలంగాణ అమరవీరుల ఆశయాలకు ద్రోహం చేసిన కాంగ్రెస్, బీజేపీలకు మధ్య జరుగుతున్న పోరాటంలో ప్రజలంతా గెలవాలి.
– ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, బీఆర్ఎస్ కందనూలు పార్లమెంట్ అభ్యర్థి