మహబూబ్నగర్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడు తూ.. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ నిర్వహించిన పోరుబాట బస్సుయాత్ర విజయవంతమైంది. రెండ్రోజుల పాటు మహబూబ్నగర్, నాగర్కర్నూల్లో నిర్వహించిన రోడ్ షో, కార్నర్ మీటింగ్ సక్సెస్ అయ్యింది. రోడ్ షోను విజయవంతం చేసేందుకు గులాబీ శ్రేణు లు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయగా కేసీఆర్ను చూసేందుకు జనం ఎగబడ్డారు. బస్సుయాత్ర సందర్భంగా కేసీఆర్ ఒకరోజు పాలమూరులోనే ఉండి రెండు పార్లమెం ట్ స్థానాల పరిధిలో గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహంపై మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎ మ్మెల్యేలతో సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఇ క్కడి నుంచే రాష్ట్రంలో కరెంటు కోతలపై తన ఎక్స్ ఖా తాలో ఎండగట్టారు. రోడ్ షో విజయవంతం కావడం తో గులాబీ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపిస్తున్నది.
ప్రజలు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులను క ళ్లారా చూసేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పోరుబాట పేరిట బస్సుయాత్ర ప్రారంభించారు. ఈక్రమం లో శుక్రవారం సాయంత్రం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అడుగుపెట్టిన యాత్రకు జనం నీరాజనం పలికారు. దారి పొడవునా అధినేతను చూసేందుకు పోటీపడ్డారు. ఆయా మండలకేంద్రాల్లో గులాబీ శ్రేణులు కేసీఆర్ బస్సుపై పూలవర్షం కు రిపించారు. సీఎం ఇలాఖాలో కేసీఆర్ చేపట్టిన పోరుబాట విజయవంతం కావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో గు బులు మొదలైంది. మహబూబ్నగర్లో నిర్వహించిన కార్నర్ మీటింగ్కు ఇసుకేస్తే రాలనంత జనం హాజరయ్యారు. ప్రభుత్వ వైఫల్యాలను కేసీఆర్ ఎండగడుతుం టే.. వద్దురా బాబు ఈ కాంగ్రెస్ పాలన అంటూ ప్రజ లు నినాదాలు చేశారు.
పాలమూరులో కేసీఆర్ బసజేసిన మాజీ మంత్రి శ్రీ నివాస్గౌడ్ నివాసం వద్ద శనివారం కోలాహలం నెలకొన్నది. అధినేతను చూసేందుకు జనం పెద్ద ఎత్తున త రలొచ్చారు. సాయంత్రం నాగర్కర్నూల్లో బస్సుయా త్ర చేపట్టేందుకు గులాబీ బాస్ బయటకు రావడంతో ఒక్కసారిగా జై కేసీఆర్.. జై తెలంగాణ నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. అనంతరం కేసీఆర్ బస్సు ఎక్కి అభివాదం చేస్తూ కందనూలుకు పయనమయ్యా రు. ఈ క్రమంలో భూత్పూర్ వద్ద మాజీ ఎమ్మెల్యే ఆల ఆధ్వర్యంలో పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. దా రి పొడవునా కేసీఆర్కు జనం చేతులు ఊపుతూ కనిపించారు. అధినేతను చూసేందుకు ప్రజలు తరలివచ్చారు.
ఉమ్మడి పార్లమెంట్లోని రెండు స్థానాలను మళ్లీ నిలబెట్టుకోవాలని పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. పదేండ్లలో పాలమూరును ఎంతో అభివృద్ధి చేశామని.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలు అసంతృప్తిలో ఉన్నారన్నారు. గ్రామస్థాయిలో ప్రచారాలు ముమ్మరం చేసి ఎంపీ ఎన్నికల్లో సత్తా చా టాలని సూచించారు. పార్లమెంట్ ఎన్నికల వేళ ఉమ్మడి జిల్లాలో కేసీఆర్ చేపట్టిన రోడ్ షో విజయవంతం కావడంతో కాంగ్రెస్ నేతలకు భయం పట్టుకున్నది. ఇప్పటికే పాలమూరు పార్లమెంట్ స్థానంపై పట్టు నిలిపేందుకు కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. ఏకంగా సీఎం నాలుగుసార్లు మహబూబ్నగర్ నియోజకవర్గంలో పర్యటించినా జనం నుంచి స్పందన రాలేదు. కానీ కేసీఆర్ రోడ్ షోకు మాత్రం భారీ ఎత్తున జనం రావడంతో ఆ పార్టీ అంతర్మథనంలో పడింది. అధినేత రోడ్షో గులాబీ పార్టీ లో నయా జోష్ను నింపింది.