మహబూబ్నగర్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పాలమూరు పార్లమెంట్ స్థానంలో సత్తా చాటాలని పార్టీ క్యాడర్కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ నివాసంలో మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలోని మా జీ ఎమ్మెల్యేలతో గులాబీ బాస్ కేసీఆర్ శనివారం సమీ క్ష నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల్లో మన్నె శ్రీనివాస్రెడ్డి గెలుపునకు చేపట్టాల్సిన కార్యాచరణ వ్యూహా లపై చర్చించారు. మహబూబ్నగర్ స్థానం ముందునుంచే మంచి పట్టు ఉన్న స్థానమని.. ఈసారి ఎలాగై నా గెలిచి తీరాలని మాజీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ సూ చించారు. ‘ఆ రోజు పాలమూరు ప్రజలు టీఆర్ఎస్ పార్టీని గుండెల్లో పెట్టుకొని ఆదరించారు.. ఆ తర్వాత రెండుసార్లు వరుసగా గులాబీ విజయానికి బాటలు వేశారు’ అని గు ర్తు చేశారు. బస్సుయాత్ర సందర్భం గా పాలమూరులో వచ్చిన జన సం దోహమే మన పార్టీ విజయానికి తొ లిమెట్టు అని.. దీన్ని ఇలాగే కంటి న్యూ చేయాలన్నారు. పాలమూరు లో గెలిస్తే రాష్ట్ర రాజకీయాలే మారిపోతాయని.. అందరూ కలిసికట్టు గా శ్రమించి పార్టీ అభ్యర్థి మన్నెను గెలిపించాలన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్కు జాతీయ హోదా ఇవ్వకపోవడం, బీజేపీ బూటకపు వా గ్దానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కరెంటు కోత లు, రైతుబంధు పింఛన్లు, ఇతరత్రా అంశాలను గ్రామీణస్థాయిలో చర్చకు పెట్టాలని దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ అధికారం చేపట్టిన ఐదు నెలల్లోనే వ్యతిరేకత మూట గట్టుకుందన్న విషయాన్ని ప్రచారం చేస్తామని మాజీ ఎమ్మెల్యేలు చెప్పారు. కాగా సమావేశంలో రెం డుసార్లు కరెంటు పోయింది. సమీక్షలో ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, పట్నం నరేందర్రెడ్డి, రాజేందర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి, పార్టీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్రెడ్డి పాల్గొన్నారు.