న్యూఢిల్లీ : ఢిల్లీతో పాటు చాలా రాష్ట్రాల్లో కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందడం, చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇదే విషయం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (క్యాట్) నిర్వహించిన ఒక సర్వేలో తేలింది. దేశంలో 67.5 శాతం మంది జాతీయ స్థాయిలో లాక్డౌన్ విధించాలని కోరుకోవడం విశేషం.
క్యాట్ నిర్వహించిన సర్వేలో 9,117 మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు క్యాట్ జాతీయ అధ్యక్షుడు బీసీ భారతీయా, జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు. దేశంలో కరోనా అనియంత్రితంగా మారిందని 78.2 శాతం మంది పేర్కొనగా.. 67.5 శాతం మంది లాక్డౌన్ విధించాని సూచించారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవటానికి ప్రధాని నరేంద్ర మోదీ సమర్ధంగానే నిర్వహిస్తున్నారని 73.7 శాతం మంది అంగీకరించారు.
దేశవ్యాప్తంగా ప్రతిరోజూ నాలుగు లక్షల మందికి పైగా కరోనా బారిన పడుతున్నారని ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు. కొవిడ్ను వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉన్నందున లాక్డౌన్ విధిస్తే జనాలను కాపాడవచ్చుని ప్రజలు అభిప్రాయపడ్డారని పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి చెందడానికి ముందు దానికి కళ్ళెం వేయడం చాలా ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. సరైన సమయంలో చికిత్స లేకపోవడం వల్ల మరణాల రేటు పెరుగుతున్నదని ఆయన విచారం వ్యక్తం చేశారు. గత సంవత్సరం మాదిరిగానే జాతీయ స్థాయిలో లాక్డౌన్ విధించడం ద్వారా కరోనాను అరికట్టవచ్చునని ఆయన చెప్పారు.
ఈ నెల 10 న విశ్వాస పరీక్ష ఎదుర్కోనున్న కేపీ ఒలి
చైనాపై వైఖరి మార్చుకున్న న్యూజిలాండ్
తన నిర్ణయాన్ని సమర్ధించుకున్న ఆస్ట్రేలియా ప్రధాని
మయన్మార్లో ఆర్మీ అణచివేత: సైన్యం కాల్పుల్లో 8 మంది మృతి
గ్లేసియర్స్ కరిగి ఏర్పడిన వేలాది సరస్సులు.. శాస్త్రవేత్తల హెచ్చరిక
ఆన్లైన్లో 60 మంది వైద్యులు.. వివిధ భాషల్లో సేవలు
అద్వానీ రథయాత్ర కారకుడు ప్రమోద్ మహాజన్.. చరిత్రలో ఈరోజు
లాక్డౌన్ తరహా ఆంక్షలు పొడగించిన పంజాబ్ ప్రభుత్వం
ప్రపంచంలోని పొడవైన సస్పెన్షన్ బ్రిడ్జి ప్రారంభం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..