ఎల్ఐసీ ఐపీవో మంగళవారం లిస్ట్ కాబోతోంది. ఒక్కో స్టాక్ ధరను గరిష్ఠంగా రూ.949గా నిర్ణయించారు. రిటైల్ ఇన్వెస్టర్లు, పాలసీహోల్డర్ల కళ్లన్నీ ఇప్పుడు లిస్టింగ్పైనే ఉన్నాయి. ఎందుకంటే ఈ ఇష్యూ వచ్చిన టైమింగ్ మొదలు.. ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ వ్యతిరేకంగా ఉంటూ వచ్చాయి. అయితే దీన్ని మరికొంతమంది రిటైలర్లు, పాలసీహోల్డర్లు మాత్రం అవకాశంగా చూస్తున్నారు. ఈ విభాగాలు రెండూ ఓవర్ సబ్స్ర్కైబ్ అయినందున వీరు దరఖాస్తు చేసినన్ని షేర్ల కేటాయింపు జరగలేదు. 210 షేర్ల కోసం దరఖాస్తు చేసుకుంటే పాలసీదారులకు 48 షేర్లు, రిటైల్ ఇన్వెస్టర్లకు 77 షేర్లు అలాట్ అయ్యాయి.
పాలసీదారులు, రిటైలర్లు ఐపీవోలో పెట్టుబడి చేసిన మొత్తంలో కొంత తిరిగి వెనక్కు వచ్చినందున, వారు లిస్టింగ్ తర్వాత షేర్లు కొనే అవకాశం కోసం ఎదురు చూస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు. మరికొంతమం ది మారిన మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా విక్రయించే ప్రయత్నం కూ డా చేయవచ్చు. అధిక శాతం మంది మాత్రం లిస్టింగ్ రోజున ఏదైనా కరెక్షన్ వస్తే.. భారీగా కొనేద్దామని, డిస్కౌం ట్లో స్టాక్ దొరుకుతుంది కాబట్టి వదలొద్దంటూ క్యాష్తో రెడీ అవుతున్నారు. ఇంతకీ లిస్టింగ్ రోజున ఏం చేయొచ్చు? లాభాలొస్తే అమ్ముకుని బయటపడాలా.. నష్టానికి వైదొలగాలా.. కరెక్షన్ వస్తే కొనుక్కోవచ్చా.. మరిన్ని యాడ్ చేసుకోవాలా ?..
దేశీయ స్టాక్ మార్కెట్లో అతిపెద్ద ఐపీవోగా వచ్చిన ఎల్ఐసీకి ఎదురుగాలి వీస్తోంది. నెలల తరబడి ఆలస్యంగా వచ్చిన ఈ ఇష్యూకు ఆది నుంచి ఇబ్బందులే. రెండు, మూడుసార్లు తేదీలను జరపడం ఒక సమస్య అయితే, షేర్లు లిస్టవుతున్న తరుణం మరో సమస్య. ఇష్యూ ప్రతిపాదించినప్పటి నుంచి మార్కెట్ సూచీలు 15 శాతంపైగా పతనమైన సమయంలో ఎల్ఐసీ షేర్లు స్టాక్ ఎక్సేంజీల్లో అడుగుపెడుతున్నాయి. దీంతో ఎల్ఐసీ స్టాక్ లాభాలతో కాకుండా నష్టాలతో లిస్ట్ అయ్యే ప్రమాదం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
వాస్తవానికి ఇష్యూ ధర రూ.949గా నిర్ణయమైనప్పటికీ రిటైలర్లకు రూ.45, పాలసీ హోల్డర్లకు రూ.60 చొప్పున డిస్కౌంట్ ఇచ్చారు. దీంతో ఒకవేళ ఏ మాత్రం ప్రీమియంతో లిస్ట్ అయినా.. ఇప్పుడున్న మార్కెట్ కండిషన్ల దృష్ట్యా జనాలు తెగనమ్ముకోవాడనికే అధిక ప్రాధాన్యతను ఇస్తారు. అలా అమ్మకాలు జరిగితే స్టాక్ నష్టాల్లోకి జారుకున్నా ఆశ్చర్యం లేదు. షేరు రూ. 900 సమీపంలో లిస్టయినా, పాలసీదారులు, రిటైలర్ల పెట్టుబడి భద్రతకు ఢోకా లేదు. ఇలా తక్కువ ధరతో ట్రేడవుతుంటే, ఐపీవోలో తగినంతగా షేర్లు కేటాయింపు జరగని కారణంగా వీరు కొనుగోళ్లకు ఆసక్తి కనబర్చవచ్చు.
60%పైగా మార్కెట్ షేర్ ఎల్ఐసీదే. అయితే గతకొన్నేండ్ల నుంచి మార్కెట్ షేర్ క్రమంగా పడిపోతోంది. కొత్త జనరేషన్ను ఆకట్టుకోలేకపోవడం, ప్రైవేట్ సంస్థల నుంచి ఎదురవుతున్న తీవ్ర పోటీ ఇందుకు ప్రధాన కారణాలు.
లిస్టింగ్ రోజునే స్టాక్ కొనాల్సిన అవసరం లేదు. ప్రైస్ డిస్కవరీ జరిగిన తర్వాత నిర్ణయం తీసుకోవచ్చు. ఒక వేళ లిస్టింగ్ గెయిన్స్ రాకుండా డిస్కౌంట్లో లిస్ట్ అయి స్టాక్ పడిపోయినా కూడా యావరేజింగ్ కోసం కొనాలనుకుంటే, దీర్ఘకాలిక పెట్టుబడి లక్ష్యంతోనే అది చేయాలి. జీవిత బీమా అనేది దీర్ఘకాలానికి ఉపయోగపడినట్టుగానే ఎల్ఐసీ షేర్లను స్వల్పకాలిక లాభాల దృష్ఠితో కాకుండా దీర్ఘకాలిక కోణంలోనే పెట్టుబడి చేయాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.
ఇదే చాలామంది రిటైలర్ల మదిలో ఉన్న మిలియన్ డాలర్ల ప్రశ్న. అయితే ఇప్పుడున్న మార్కెట్ కండిషన్లో లిస్టింగ్ రోజునే ఆరాటపడాల్సిన అవసరం లేదు అనేది నిపుణుల సలహా. ఎందుకంటే లిస్టింగ్ రోజున స్టాక్లో తీవ్ర ఒడిదుడుకులు నెలకొనే అవకాశం ఉంది కాబట్టి ఆగడమే మంచిదిగా వారు చెప్తున్నారు.