Lambadi Leaders | లంబాడీల ఓట్లతో గెలిచి.. ఆ జాతిని మోసం చేసి.. తిరిగి తాజాగా బస్సు యాత్ర పేరుతో సీఎం రేవంత్రెడ్డి కొత్త డ్రామా ఆడుతున్నాడని సేవాలాల్ బంజార సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కొర్ర మోతీలాల్ నాయక్ ఇప్పటికే ఆరోపించారని తెలిసిందే. బస్సు యాత్రతో తండాలకు వస్తే చీపుర్లు, చెప్పులదండలతో గిరిజనులు సిద్ధంగా ఉండాలని పిలుపు కూడా ఇచ్చారు.
ఈ క్రమంలో లంబాడి నేతలు ఇవాళ గాంధీ భవన్ను ముట్టడించారు. లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఖబడ్దార్ రేవంత్ రెడ్డి.. బస్సు యాత్రను ఆపాలి.. లంబాడిలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాకే బస్సు యాత్ర చేయాలని ఆందోళన చేపట్టడంతో రంగంలోకి దిగిన పోలీసులు లంబాడ నేతలను అరెస్ట్ చేశారు.
గాంధీ భవన్ను ముట్టడించిన లంబాడి నేతలు
లంబాడిలకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్
లంబాడిలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాకే బస్సు యాత్ర చేయాలని డిమాండ్
లంబాడ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు pic.twitter.com/XFbOYmaBh4
— Telugu Scribe (@TeluguScribe) June 25, 2026