హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా శ్రీరామ నవమి (Ram Navami ) వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. కూకట్పల్లిలోని(Kukatpally) ప్రముఖ, ప్రాచీన రామాలయంలో జరిగిన సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవములో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) పాల్గొన్నారు. స్వామి వారిని దర్శించుకొని పూజలు చేశారు. కేటీఆర్ రాకతో ఆలయ పరిసరాల్లో సందడి మొదలైంది. జై శ్రీరామ్ నినాదాలతో భక్తులు హోరెత్తించారు. కేటీఆర్తో పాటు స్థానిక ఎమ్మెల్యే కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్, పార్టీ సీనియర్ నాయకులు కూడా ఉన్నారు.