Mahindra | న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: కాంప్యాక్ట్ ఎస్యూవీ విభాగాన్ని మరింత బలోపేతం చేసే ఉద్దేశంలో భాగంగా మహీంద్రా అండ్ మహీంద్రా సరికొత్త మాడల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఎక్స్యూవీ 300ని అప్డేట్ చేసి డిజైనింగ్, ఫీచర్స్, భద్రత పరంగా పలు మార్పులు చేసి మళ్లీ అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈ కారు ప్రారంభ ధర 7.49 లక్షలుగా నిర్ణయించింది. మహీంద్రా సరికొత్తగా ఈ మాడల్లో పానోరామిక్ సన్రూఫ్, ఏడు స్పీకర్లు, డ్యూయల్-జోన్ ైక్లెమెట్ కంట్రోల్ సిస్టమ్ వంటి ఫీచర్లతో తీర్చిదిద్దింది. ఆరు స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ వెర్షన్ను 1.5 లీటర్ల టర్బో డీజిల్ ఇంజిన్, 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్తో రూపొందించింది.