హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ):‘నేను రాను బిడ్డో సరారు దవాఖానకు..’ అనే దుస్థితి నుంచి పోదాం పద సరారు దవాఖానకే అనే ధీమాను ఇచ్చింది కేసీఆర్ పాలన అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో వైద్య ఆరోగ్యరంగం ప్రగతిపై శుక్రవారం ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు.
జననం నుంచి మరణం దాకా, ప్రతి దశలో మన సరారు ఉన్నది అనే గొప్ప భరోసా ప్రజలకు కల్పించామని, కేసీఆర్ కిట్లు, న్యూట్రిషన్ కిట్లు, డయాలసిస్ సెంటర్లు, డయాగ్నోస్టిక్ కేంద్రాలు, బస్తీ దవాఖానలు, మాతాశిశు కేంద్రాలు నగరం నలుమూలల సూపర్ స్పెషాలిటీ దవాఖానలు, వరంగల్ నడిబొడ్డున దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ హాస్పిటల్ నిర్మించామని గుర్తుచేశారు. జనాభా దామాషాలో మరే రాష్ట్రంలో లేనన్ని మెడికల్ సీట్లు, ఒకటా, రెండా ఇలా.. కేసీఆర్ పాలనలో వైద్య ఆరోగ్య రంగం దేశ చరిత్రలోనే ఒక అరుదైన విప్లవమని పేర్కొన్నారు.