హైదరాబాద్, మే4 (నమస్తే తెలంగాణ): బీజేపీ రిజర్వేషన్ల వ్యతిరేకి అనే ముద్ర పోవాలంటే బీసీలకు చట్టసభలలో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని వెంటనే ప్రకటించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీకి శనివారం ప్రత్యేకంగా లేఖ రాశారు.
బీసీ రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని, వచ్చే ఎన్నికల్లో 400 సీట్లు వస్తే రిజర్వేషన్లు ఎత్తివేస్తారనే చర్చ దేశవ్యాప్తంగా కొనసాగుతున్నదని, ప్రత్యేకంగా కాంగ్రెస్, ఎస్పీ, ఆర్జేడీ, డీఎంకే, వామపక్ష పార్టీలు బలంగా వాదిస్తున్నాయని తెలిపారు. ప్రధానమంత్రి వెంటనే స్పందించి బీసీలకు చట్టసభలలో 50శాతం రిజర్వేషన్లు పెడతామని, బీసీ కులగణన చేస్తామని ప్రకటించాలని డిమాండ్ చేశారు.