హుజురాబాద్ : హుజురాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీలోకి చేరికల పర్వం ఊపందుకుంది. ప్రభుత్వ పనితీరు, దళితబంధు వంటి సంక్షేమ పథకాలకు ఆకర్శితులై ప్రజలు పెద్ద సంఖ్యలో పార్టీలో చేరుతున్నారు. తాజాగా జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామానికి చెందిన డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ యూత్ అసోసియేషన్ కు చెందిన యువకులు ఆదివారం టీఆర్ ఎస్లో చేరారు.
జమ్మికుంట రూరల్ టీఆర్ ఎస్ ఇన్చచార్జ్ వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ అరూరి రమేష్ సమక్షంలో బాబా సాహెబ్ అంబేడ్కర్ యువత ఈర్ల రమేష్,పుల్లూరి మహేందర్, సందీప్, రాజేష్, కుమారస్వామి, శ్రీనివాస్, గణేష్, అశోక్, రజినీకాంత్, నిశాంత్, ప్రవీణ్, రాజ్ కుమార్, అరవింద్లతోపాటు 50మంది టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సంధర్బంగా ఎమ్మెల్యే యువతకు కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని అన్ని రంగాల వారికి సంక్షేమం, అభివృద్ధి సమంగా అందిస్తుందన్నారు.
అందుకే ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిలో పాలుపంచుకునేందుకు అన్ని పార్టీల నుండి టీఆర్ఎస్ వైపు నడుస్తున్నారని అన్నారు. ఈ చేరికలు సీఎం కేసీఆర్ గారు చేస్తున్న అభివృద్ధి పనులకు, సంక్షేమ పథకాల అమలుకు నిదర్శనమని అన్నారు. తమ పార్టీ ని నమ్మి వచ్చిన కార్యకర్తలను నా అద్వర్యం లో కంటికి రెప్పలా కాపాడుకుంటామని హామీ ఇచ్చారు.. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మమత,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ, తెరాస నాయకులు శ్రీధర్ రెడ్డి, భరత్ కుమార్ రెడ్డి, లింగారావు, రాజేశ్వర్ రావు , సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు,వార్డుమెంబర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.