సిద్దిపేట : గజ్వేల్ నియోజకవర్గంలోని మర్కూక్లో నిర్మించిన కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ అద్భుతంగా ఉందని రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాజేశ్వర్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లాలోని పలు అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ వెంకట్రామ్రెడ్డితో కలిసి సందర్శించారు.
ఇందులో భాగంగా సాయంత్రం మర్కూక్ మండల కేంద్రంలోని కొండపోచమ్మ సాగర్ను ప్రాజెక్టును సంర్శించారు. కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ నిర్మాణం, భూసేకరణ, ముంపు గ్రామాల ప్రజలకు అందించిన పునరావాసాలు, సాగర్ ద్వారా కలిగే ప్రయోజనాల గురించి క్షణ్ణంగా వివరించారు.
ఈ సందర్భంగా రాజేశ్వర్రావు మాట్లాడుతూ.కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ చాలా బాగున్నదని కితాబునిచ్చారు. వ్యవసాయం, రైతుల అభివృద్ధిని కాంక్షిస్తూ సీఎం కేసీఆర్ గజ్వేల్ ప్రాంతంలో అద్భుతమైన రిజర్వాయర్ను నిర్మించారని ప్రశంసించారు.
ఇవి కూడా చదవండి..
భక్తులతో కిక్కిరిసిన ‘మల్లన్న’ క్షేత్రం
సీఎం కేసీఆర్తోనే తెలంగాణ అభివృద్ధి : మంత్రులు
జొన్నకుప్ప దగ్ధం.. రూ.45వేల నష్టం
ఆలస్యంగా నిద్ర పోతున్నారా..? మెదడు పనితీరు తగ్గుతుందట..!
లారీని ఢీకొట్టిన కారు..వ్యక్తి మృతి
నిజామాబాద్లో వృద్ధ దంపతుల ఆత్మహత్య