పెనుబల్లి, నవంబర్ 28:గ్రామీణ ప్రాంతాల్లోనూ అన్ని వేళలా వైద్యసేవలందించేందుకే సీఎం కేసీఆర్ పల్లె దవాఖానలను అందుబాటులోకి తెచ్చారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. ప్రతీ పల్లెకూ వైద్య సేవలు విస్తరిస్తుండడంతో రాష్ట్రం.. ఆరోగ్య తెలంగాణగా రూపుదిద్దుకుంటోందని అన్నారు. మండలంలోని భవన్నపాలెం సబ్ సెంటర్ను సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. సత్తుపల్లి నియోజకవర్గానికి 22 పల్లె దవాఖానలు మంజూరు కాగా అందులో నాలుగు పెనుబల్లి మండలానికి వచ్చినట్లు చెప్పారు. కేరళ, తమిళనాడు తర్వాత తెలంగాణే ఆరోగ్యవంతమైన రాష్ట్రంగా నిలిచిందని వివరించారు. రాష్ట్రంలోని ప్రతి పేదవాడికీ ఇంటి వద్దకే వైద్య సేవలు అందించాలన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయమని అన్నారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా గడిచిన మూడేళ్లలో నియోజకవర్గవ్యాప్తంగా రూ.17 కోట్ల మేర సాయం అందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని స్పష్టం చేశారు. ఈ సదుపాయాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వాదించాలని కోరారు.
ఇంటింటికీ వెళ్లి చెక్కుల పంపిణీ..
దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ పథకాల లబ్ధిని నేరుగా పేదల ఇళ్లకు వెళ్లి అందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను సోమవారం ఆయన నేరుగా వారి ఇళ్ల వద్దకే వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కుటుంబానికీ ‘నేనున్నా’నంటూ అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని గుర్తుచేశారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు కావూరి మహాలక్ష్మి, రమాదేవి, చెక్కిలాల మోహన్రావు, చెక్కిలాల లక్ష్మణ్రావు, శాంతారాణి, సోడే రాంబాబు, కనగాల వెంకటరావు, లక్కినేని వినీల్, మందడపు అశోక్కుమార్, చెలికాని నీలాద్రిబాబు, భూక్యా ప్రసాద్, కోటగిరి సుధాకర్బాబు, మువ్వా బేబీ సరోజిని, భూక్యా పంతులి, తేజావత్ తావూనాయక్, కాకా రుద్రజరాణి, సోడే రాంబాబు, లక్ష్మీకాంతం, ముక్కర భూపాల్రెడ్డి, జంపా వియ్యన్నబాబు, టీవీ రామారావు, యలమర్తి శ్రీను, మరకాల చంటి, కోమటి ప్రసాద్, కోమటి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.