హైదరాబాద్: ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ చైర్మన్ సుదర్శన్ ముదిరాజ్ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. దవాఖానలో చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి 12.31 గంటలకు శ్వాస విడిచారు. ఈమేరకు ఆయన కుమారుడు సింగరి రాజ్ కుమార్ తెలిపారు. పంజాగుట్ట స్మశాన వాటికలో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తామని చెప్పారు.