కమాన్చౌరస్తా, ఏప్రిల్ 24: ఇంటర్మీడియట్ ఫలితాల్లో కరీంనగర్ రాష్ట్ర స్థాయిలోనే టాప్లో నిలిచింద. ఫస్టియర్ ప్రథమలో ఐదు, సెకండియర్లో నాలుగో స్థానాన్ని కైవసం చేసుకున్నది. మొదటి సంవత్సరంలో కరీంనగర్ జిల్లా నుంచి 15058 మంది పరీక్షకు హాజరు కాగా, 9548 మంది (63.41 శాతం) ఉత్తీర్ణత సాధించారు. 13వ స్థానంలో నిలిచిన రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి 3542 మంది పరీక్షకు హాజరు కాగా, 2047 మంది (57.79 శాతం) ఉత్తీర్ణత సాధించారు. 25వ స్థానంలో నిలిచిన జగిత్యాల జిల్లా నుంచి 5717 మంది పరీక్షకు హాజరు కాగా, 2955 మంది (51.69 శాతం) ఉత్తీర్ణత సాధించారు. అలాగే 31వ స్థానంలో నిలిచిన పెద్దపల్లి జిల్లా నుంచి 4120 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, 1908 మంది (46.31 శాతం) ఉత్తీర్ణత సాధించారు.
సెకండియర్ ఫలితాల్లో కరీంనగర్ 4వ ర్యాంకును కైవసం చేసుకోగా.. 13407 మంది పరీక్షకు హాజరు కాగా, 9974 మంది (74.39) ఉత్తీర్ణత సాధించారు. అలాగే 16వ స్థానంలో నిలిచిన రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి 3180 మంది పరీక్షకు హాజరుకాగా, 2083 మంది (65.5శాతం) ఉత్తీర్ణత సాధించారు. 21వ స్థానంలో నిలిచిన జగిత్యాల జిల్లా నుంచి 5741 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, 3691 మంది (64.29) శాతం ఉత్తీర్ణత సాధించారు. 31వ స్థానంలో పెద్దపల్లి జిల్లా నుంచి 4007 మంది పరీక్షకు హజరు కాగా, 2377 మంది (59.32 శాతం) ఉత్తీర్ణత సాధించారు.