గోదావరిఖని, మార్చి 11 : సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం (టీబీజీకేఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్గా కెంగర్ల మల్లయ్యను నియమిస్తున్నట్లు గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు. ఈ మేరకు హైదరాబాద్లోని గౌరవ అధ్యక్షురాలు కవిత నివాసంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎం పీలు మాలోత్ కవిత, వెంకటేశ్ నేతకాని, ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, నడిపెల్లి దివాకర్రావు, గండ్ర వెంకటరమణారెడ్డి, దుర్గం చిన్నయ్య, యూనియన్ అధ్యక్షుడు బీ వెంకట్రావ్, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి సమక్షంలో నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం కెంగర్ల మల్లయ్య ఎమ్మెల్సీ కవితకు, మంత్రి, యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షురాలు మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సింగరేణి గనులను ప్రైవేటీకరించేందుకు చేస్తున్న కుట్రలను టీబీజీకేఎస్ పోరాటాలతో తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ కార్మికులకు అనేక హక్కులు, సౌకర్యాలు కల్పిస్తున్నారని వివరించా రు. కరోనా విపత్కర సమయంలో సైతం కార్మికులకు 29 శాతం లాభాల వాటా ఇచ్చారని గుర్తు చేశారు. ఏ ప్రభుత్వ రంగ పరిశ్రమల్లోనూ లాభాల వాటా కార్మికులకు ఇవ్వడం లేదని, సింగరేణి కార్మికులు మాత్రమే పొందుతున్నారని తెలిపారు. కార్మికులు టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సమ్మె పోరా టం చేయడం వల్లే ఏ ఒక్క సంస్థ కూడా గనులను దక్కించుకునేందుకు టెండర్లు వేయలేదని చెప్పారు. రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన సింగరేణి కార్మికులకు అన్ని విధాలా సీఎం కేసీఆర్ అండగా నిలుస్తారని వివరించారు.
టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్యకు ఘన స్వాగతం పలికారు. గోదావరిఖని లోని ప్రధాన చౌరస్తాలో ఆ యూనియన్ నాయకులు పర్లపల్లి రవి ఆధ్వర్యంలో మల్లయ్యను ఆహ్వానించారు. కార్యక్రమంలో దశరథం గౌడ్, నాయర శ్రీనివాస్, ఏడుగోల పవన్, ఉస్మాన్, సురేశ్, రామయ్య, నల్లాల శ్రీనివాస్, మోహన్ రావు, జోసఫ్, రమేశ్ రెడ్డి, దాసరి నర్సయ్య, నాయి శంకర్, రొడ్డ సంపత్, మహేశ్, మల్లయ్య, గుండు శ్రావణ్ తదితరులు ఉన్నారు.