Crime News | బంజారాహిల్స్,ఏప్రిల్ 28: మితిమీరిన వేగం, భారీ శబ్దాలు వచ్చే విధంగా సైలెన్సర్లను ఏర్పాటు చేసిన కారు డ్రైవర్పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. శనివారం రాత్రి పదిన్నర సమయంలో జూబ్లీహిల్స్లో అత్యంత వేగంతో కారు దూసుకువెళ్లడంతో పాటు భారీ శబ్ద కాలుష్యాన్ని కలిగిస్తోందని స్థానికులు ఫిర్యాదు చేశారు.
రంగంలోకి దిగిన పోలీసులు కారును అడ్డుకున్నారు. అది 2008 మోడల్ హోండా సివిక్ కారు కాగా.. దానిని రీమోడలింగ్ చేయడంతో పాటు సైలెన్సర్లను, డోర్లను కూడా మార్చినట్లు గుర్తించారు. ప్రజలకు అసౌకర్యం కలిగించడంతో పాటు ర్యాష్ డ్రైవింగ్కు పాల్పడిన టోలీచౌకికి చెందిన డ్రైవర్ ఎండీ అనీస్ ఆథిల్పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.