తిరుమల : జమ్మూ కాశ్మీర్ లెఫ్ట్నెంట్ గవర్నర్( Lieutenant Governor ) మనోజ్ సిన్హా ( Manoj Sinha ) శుక్రవారం తిరుమల ( Tirumala ) వేంకటేశ్వర స్వామిని దర్శంచుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన మహా ద్వారం వద్ద టీటీడీ ఈవో రవిచంద్ర , ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు.
ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద పూజలు నిర్వహించిన అనంతరం, ఉప గవర్నర్ స్వామివారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించారు. ఈవో లెఫ్ట్నెంట్ గవర్నర్కు తీర్థ ప్రసాదాలను, స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు. ఈ కార్యక్రమంలో ఉప కార్యనిర్వహణాధికారులు లోకానందం, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.