దుబాయ్ : ఇరాన్కు చెందిన యుద్ధ నౌక ఖార్గ్.. ఓమన్ గల్ఫ్లో మునిగిపోయింది. ఓడలోని సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. మునిగిపోవడానికి ముందు పేలుడు సంభవించి మంటలు అంటుకున్నట్లుగా నేవీ అధికారులు చెప్తున్నారు. ఈ సంఘటన ఇరాన్ ఓడరేవు జాస్క్ సమీపంలో జరిగింది. పేలుడుకు గల కారణం ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నది.
స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.25 గంటలకు ఖార్గ్ యుద్ధనౌకపై మంటలు ప్రారంభమైనట్లు ఇరాన్ స్టేట్ టీవీ తెలిపింది. ఈ యుద్ధనౌకపై సైనిక విన్యాసాలు జరుపుతున్నట్లు తెలుస్తున్నది. ఇరాన్కు చెందిన అతిపెద్ద యుద్ధనౌకను రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. లైఫ్ జాకెట్లు ధరించిన సిబ్బంది సభ్యుల వీడియో ఇరాన్లో వైరల్ అవుతున్నది. సిబ్బంది వెనుక ఓడ మంటల్లో కనిపిస్తున్నది.
ఈ యుద్ధనౌకను బ్రిటన్లో నిర్మించారు. 1977 లో సముద్రంలో అందుబాటులోకి తీసుకురాగా.. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత 1984 లో ఇరాన్ నావికాదళానికి తిరిగి కేటాయించారు. యుద్ధనౌక భారీ సరుకును ఎత్తడమే కాకుండా ఏకకాలంలో టేకాఫ్, అనేక హెలికాప్టర్లను ల్యాండింగ్ చేయగల సామర్ధ్యం కలిగి ఉన్నది.
అమ్మాయిలకు మెడిసిన్, ఇంజినీరింగ్లో 33 శాతం రిజర్వేషన్లు
అంతరిక్ష కేంద్రంతో ఢీకొన్న శిధిలం.. రోబోటిక్ చేయికి నష్టం
ఆఫ్ఘన్ నుంచి 44 శాతం యూఎస్ బలగాల ఉపసంహరణ
శ్రీలంక తీరంలో మునిగిన ఇంధనం కార్గో షిప్
జమ్ములో మళ్లీ పాకిస్తాన్ కాల్పులు..!
అంగారకుడి ఆకాశంలో మేఘాలు.. క్యూరియాసిటీ రోవర్ ఫొటోలు
వ్యాక్సిన్ వేసుకుంటేనే జీతం చెల్లిస్తాం..
కరోనా వేళ అన్నదాతలుగా మారిన యాసిడ్ బాధితులు..
కొవిడ్ వేళ దేశం విడిచి వెళ్తున్న కోటీశ్వరులు.. ఎందుకిలా..?
తెలంగాణ ప్రజల చిరకాల కోరిక నెరవేరింది.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..