న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-15వ సీజన్ ఫైనల్ అహ్మదాబాద్ వేదికగా జరుగనుంది. ప్లేఆఫ్స్, ఫైనల్ మ్యాచ్ల షెడ్యూల్ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగళవారం ప్రకటించింది. క్వాలిఫయర్-1, ఎలిమినేటర్ మ్యాచ్ ఈనెల 24, 25 తేదీల్లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరుగనుండగా.. 27న క్వాలిఫయర్-2తోపాటు తుది పోరు 29న అహ్మదాబాద్లోని నరేంద్రమోదీ స్టేడియంలో నిర్వహించనున్నారు. దీంతో పాటు మహిళల టీ20 చాలెంజ్ టోర్నీ షెడ్యూల్ను కూడా బోర్డు విడుదల చేసింది. లక్నో కాకుండా పుణె వేదికగా ఈనెల 23 నుంచి 28వ తేదీ వరకు నాలుగు మ్యాచ్లు నిర్వహించనున్నారు.