Inter Results | ఇంటర్ ఫలితాల వేళ తీవ్ర విషాదం నెలకొంది. పరీక్షల్లో ఫెయిల్ అవుతాన్న భయంతో ఫస్టియర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఖమ్మం జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. బోనకల్ మండలం రాంపల్లి గ్రామానికి చెందిన గంగదేవుళ్ల అక్షాంత్ ఇటీవల ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రాశాడు. కానీ పరీక్షలు సరిగ్గా రాయలేదని తెగ బాధపడ్డాడు. ఈ క్రమంలోనే రెండు రోజుల కింద మధిరలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఆదివారం ఇంటర్ బోర్డు విడుదల చేసిన ఫలితాలను చెక్ చేయగా అన్ని సబ్జెక్టులు పాస్ కావడం గమనార్హం.
ఆక్షాంత్కు సబ్జెక్టుల వారీగా ఇంగ్లీష్లో 67, సంస్కృతంలో 60, మ్యాథ్స్-1లో 40, మ్యాథ్స్-2లో58, ఫిజిక్స్లో 49, కెమిస్ట్రీలో 54, ఇంగ్లీష్ ప్రాక్టికల్స్లో 19 మార్కులు వచ్చాయి. మొత్తంగా ఫస్టియర్లో 470 మార్కులకుగానూ 347 మార్కులు సాధించిన బీ గ్రేడ్లో ఉత్తీర్ణుడయ్యాడు. కానీ ఫలితాలు రాకముందే, ఫెయిల్ అవుతాననే భయంతో ఆక్షాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని తల్లిదండ్రులు విలపిస్తున్నారు.
ఇవాళ ఫలితాల వెల్లడి ఉండటంతో టెన్షన్ పడిపోయాడు. పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయంతో మధిరలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే కొద్దిసేపటి క్రితం విడుదలైన ఫలితాల్లో 347 మార్కులు సాధించి, ఇంటర్ ఫస్టియర్ పాసయ్యాడు. ఈ విషయం తెలిసి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.