శ్రీరాంపూర్, ఏప్రిల్ 25 : శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే-6 గుడిసెలు సుభాష్నగర్కు చెందిన ఇంటర్ విద్యార్థి అరవింద్ పామర్(17) తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ సంతోష్కుమార్ కథనం ప్రకారం.. బుధవారం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాలు వెలువడగా.. అరవిందర్ ఎంపీసీ మ్యాథ్స్లో ఫెయిల్ అయ్యాడు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపాడు. తండ్రి రాజేందర్ మళ్లీ చదివి సప్లిమెంటరీ రాసి పాస్కా అని ధైర్యం చెప్పాడు. అయిప్పటికీ బుధవారం రాత్రి ఇంట్లో ఎవరూ చూడని సమయంలో ఇంటి వెనకాల రేకుల షెడ్డులో చున్నీతో ఉరివేసుకున్నారు. తండ్రి రాజేందర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.