జన్నారం, మే 1 : పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం కోసం పార్టీ శ్రేణులు ఐక్యతగా ఉండి కృషి చేయాలని ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు అన్నారు. బుధవారం జన్నారం మండల కేంద్రంలో కలిసి మాట్లాడారు. కేసీఆర్ సర్కారు అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి పనులపై ప్రచారం చేయాలన్నారు. హామీలు ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ తీరును ప్రజలకు వివరించాలన్నారు. అనంతరం మొదటి సారి మండలానికి వచ్చిన ఆయనను బీఆర్ఎస్ నాయకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖర్, కో ఆప్షన్ సభ్యుడు మున్వర్ అలీఖాన్, ఫజల్ఖాన్, జిల్లా అధికార ప్రతినిధి సిటిమల భరత్కుమార్, సింగిల్ విండో మాజీ చైర్మన్ శీలం రమేశ్, సులువ జనార్దన్, కేఏ నర్సింహులు, రాజేశ్వర్, రాజ్కుమార్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.