China | బీజింగ్: కార్మిక దినోత్సవంనాడు చైనాలో విషాదకర సంఘటన జరిగింది. గ్వాంగ్డాంగ్, నార్తర్న్ మెయిఝౌ సిటీ, డబు కౌంటీలో బుధవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఓ హైవే కూలిపోవడంతో 24 మంది ప్రాణాలు కోల్పోయారు.
పర్వత ప్రాంతంలో ఉన్న ఈ హైవే శిథిలాల క్రింద సుమారు 20 వాహనాలు, 54 మంది ప్రయాణికులు చిక్కుకున్నారు. కార్మిక దినోత్సవాల సందర్భంగా ఐదు రోజులపాటు సెలవులు కావడంతో హైవేలపై టోల్ ఫ్రీగా ప్రయాణం చేయవచ్చు. దీంతో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా ఉండే సమయంలో ఈ ప్రమాదం జరిగింది.