న్యూఢిల్లీ : దేశంలో కరోనాకు వ్యతిరేకంగా చేపట్టిన టీకా డ్రైవ్లో ఇప్పటి వరకు 24కోట్లకుపైగా వ్యాక్సిన్ మోతాదులు పంపిణీ చేసినట్లు కేంద్ర, కుటుంబ ఆరోగ్యమంత్రిత్వశాఖ గురువారం తెలిపింది. 24 గంటల్లో 33,79,261 మోతాదులను అందజేసినట్లు చెప్పింది. గురువారం ఉదయం 7 గంటల వరకు అందించిన తాతాల్కిక సమాచారం మేరకు 33,82,775 సెషన్ల మొత్తం 24,27,26,693 వ్యాక్సిన్ మోతాదులు వేసినట్లు పేర్కొంది. ఇదిలా ఉండగా.. 24 గంటల్లో దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయని పేర్కొంది. 94,052 కేసులు నమోదయ్యాయని, వరుసగా లక్ష కన్నా తక్కువగా నమోదవడం మూడోసారని చెప్పింది. ప్రస్తుతం క్రియాశీల కేసులు 11,67,952 ఉన్నాయని, నాలుగు శాతమేనని పేర్కొంది. జాతీయ రికవరీ రేటు 94.77శాతంగా ఉందని తెలిపింది. వారాంతపు పాజిటివిటీ రేటు ప్రస్తుతం 5.43శాతంగా ఉందని, రోజువారీ పాజిటివిటీ రేటు 4.69శాతానికి పడిపోయిందని పేర్కొంది.