కోయంబత్తూర్ : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన ఓ వ్యక్తి తన అవయవాలు దానం చేయడం ద్వారా మరో ఎనిమిది మంది వ్యక్తులకు నూతన జీవితాన్ని ఇచ్చాడు. ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూర్లో చోటుచేసుకుంది. సింగనల్లూర్ నివాసి ఆర్.చెంతమరాయ్(51). వృత్తిపరంగా దర్జీ. జూన్ 6న ప్రమాదానికి గురయ్యాడు. కాగా మంగళవారం నాడు అతన్ని బ్రెయిన్ డెడ్గా కోయంబత్తూరులోని కోవై మెడికల్ సెంటర్ అండ్ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. దీంతో కుటుంబ సభ్యులు అవయవదానం చేసేందుకు ముందుకు వచ్చారు. లివర్, కిడ్నీని కేఎంసీహెచ్లో ఓ వ్యక్తికి ట్రాన్స్ప్లాంట్ చేశారు. మరో కిడ్నీని వెల్లూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి, గుండెను చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి, కళ్లు, చర్మం, బోన్ను కోయంబత్తూరులోని మరో ప్రైవేటు ఆస్పత్రికి తరలించి బాధితులకు ట్రాన్స్ప్లాంట్ చేశారు.