Indian Shuttlers : మలేషియాలో జరుగుతున్నబ్యాడ్మింటన్ ఆసియా టీమ్ చాంపియన్షిప్స్(Badminton Asia Team Championships)లో భారత మహిళా షట్లర్లు చరిత్ర సృష్టించారు. క్వార్టర్ ఫైనల్లో హాంకాంగ్(Hong Kong)పై అద్భుత విజయంతో తొలి పతకం ఖరారు చేశారు. గ్రూప్ దశలో బలమైన చైనా కోటను బద్ధలు కొట్టిన మన షట్లర్లు శుక్రవారం జరిగిన క్వార్టర్స్లో హాంకాంగ్ను 3-0తో చిత్తుగా ఓడించారు. ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధు(PV Sindhu), అష్మిత చలిహ(Ashmita Chaliha), డబుల్స్ క్రీడాకారిణులు అశ్విని పొన్నప్ప, తనీషా క్రాస్టోలు హాకాంగ్ ప్లేయర్లను మట్టికరిపించారు.
గాయం కారణంగా సుదీర్ఘ విరామం తీసుకున్న సింధు తనకంటే తక్కువ ర్యాంకర్ లొ సిన్ యాన్ హ్యాపీకి చుక్కలు చూపించింది. మూడు సెట్ల పోరులో 21-7, 16-21, 21-12తో గెలుపొందింది. మహిళల డబుల్స్లో పొన్నప్ప, తనీషా జోడీ 18 ర్యాంక్లో ఉన్న యంగ్ నగా టింగ్, యంగ్ పూ లామ్లను 35 నిమిషాల్లోనే చిత్తు చేశారు. యంగ్ సుమ్ యీతో జరిగిన మ్యాచ్లో అష్మిత చివరిదాకా పోరాడి టైగా ముగించింది. దాంతో, భారత బృందం సెమీఫైనల్లో అడుగుపెట్టి కనీసం కాంస్య పతకం ఖాయం చేసింది.
Indian women’s team secure their maiden medal at #BATC 🥹🫶
Proud of you girls, keep it up! 🚀@himantabiswa | @sanjay091968 | @lakhaniarun1 #BATC2024#TeamIndia#IndiaontheRise#Badminton pic.twitter.com/4KfpWjay2o
— BAI Media (@BAI_Media) February 16, 2024
‘భారత మహిళలకు ఇది మంచి ఫలితం. వాళ్ల ప్రదర్శన పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. సింధు అద్భుతంగా ఆడింది’ అని మాజీ కోచ్ విమల్ కుమార్ తెలిపాడు. టీమిండియా షట్లర్ల బృందం సెమీస్లో జపాన్, చైనా మ్యాచ్ విజేతను ఢీకొననుంది.