Writing With Fire | బడుగుల జీవితాల్లో మార్పు తీసుకురావాలన్న సంకల్పం ఒకరిది. దాన్ని సమాజానికి తెలియజెప్పే ప్రయత్నం ఇంకొకరిది. ఇప్పుడు వీళ్లిద్దరి కృషినీ గుర్తించారు ఆస్కార్ అవార్డు కమిటీ సభ్యులు. కేవలం మహిళలే నడుపుతున్న ఓ పత్రికపై ఇద్దరు మహిళలు తీసిన డాక్యుమెంటరీ ఆస్కార్ అవార్డుకు నామినేట్ కావడం గొప్ప విషయం. పితృస్వామ్య వ్యవస్థ, దళితులపై వివక్ష మొదలైన అంశాలపై కథనాలు రాస్తూ సంచలనం సృష్టిస్తున్నది ఉత్తరప్రదేశ్కు చెందిన ‘ఖబర్ లహరియా ( khabar lahariya )’. 2002లో ప్రారంభమైన ఈ పత్రికను పూర్తిగా దళిత మహిళలే నడిపిస్తున్నారు. జర్నలిస్ట్ మీరా ఇందులో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ‘ఖబర్ లహరియా’ పత్రిక విజయగాథ ఆధారంగా ‘రైటింగ్ విత్ ఫైర్ ( Writing With Fire )’ పేరుతో డాక్యుమెంటరీని తీశారు ఢిల్లీకి చెందిన రింటూ థామస్, సుస్మిత్ ఘోష్. ఈ డాక్యుమెంటరీకి 20కి పైగా పురస్కారాలు వచ్చాయి. తాజాగా అకాడమీ అవార్డ్స్ (ఆస్కార్)లో డాక్యుమెంటరీ ఫీచర్ కేటగిరీకి నామినేట్ అయ్యింది కూడా.
Read More :
ఒకసారి మోడలింగ్ చేస్తే.. ఇంకోసారి పొలం పనులు చేస్తది.. ఎందుకలా..”
Kriti Trust | నలుగురి కోసం ఆ ఇద్దరు.. లక్షల జీతాలు వదిలి మరి..”
ఆఫ్రికా దేశంలోని ఓ బ్యాంకు రూపురేఖల్నే మార్చేసిన తెలంగాణ బిడ్డ.. ఇంతకీ ఆయన ఏం చేశాడంటే..”
ఈ తహసీల్దార్ రూటే సపరేటు.. మంత్లీ మంత్లీ ఛాలెంజ్లు పెడుతూ ఆదర్శంగా మారిన ఎమ్మార్వో”