మెల్బోర్న్: ఐసీసీ టీ20 వరల్డ్కప్ 2022 టోర్నమెంట్ ఆస్ట్రేలియాలో అక్టోబర్లో జరగనున్న విషయం తెలిసిందే. ఆ టోర్నీ ప్రారంభానికి ముందు వార్మప్ మ్యాచ్లు జరుగుతాయి. అయితే ఆ వార్మప్ మ్యాచ్లకు చెందిన షెడ్యూల్ను ఐసీసీ ఇవాళ రిలీజ్ చేసింది. మొత్తం 16 జట్లు వార్మప్ ఆడుతాయి. అయితే ఇండియా జట్టు మాత్రం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్తో వార్మప్ గేమ్లు ఆడనున్నది. అక్టోబర్ 17వ తేదీన ఆస్ట్రేలియాతో, 19వ తేదీన న్యూజిలాండ్తో ఇండియా తలపడనున్నది. వార్మప్ మ్యాచ్లను అధికారిక మ్యాచ్లుగా గుర్తించరు. టీ20 వరల్డ్కప్ అక్టోబర్ 16వ తేదీన ప్రారంభం అవుతోంది. తొలి మ్యాచ్ శ్రీలంక, నమీబియా మధ్య జరగనున్నది.