హరారే: జింబాబ్వేతో జరగనున్న మూడవ వన్డేలో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయనున్నది. టాస్ గెలిచిన కెప్టెన్ రాహుల్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్ను 2-0 తేడాతో భారత్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. మూడవ వన్డేకు సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణను తప్పించారు. వారి స్థానంలో దీపక్ చాహర్, అవేశ్ ఖాన్ ఆడనున్నారు. జింబాబ్వే జట్టు రెండు మార్పులు చేసింది. తనక చివాంగ స్థానంలో రిచర్డ్ గరవ, వెస్లీ మద్వేరా స్థానంలో టోనీ ఆడనున్నారు.