మెల్బోర్న్: టీ20 వరల్డ్కప్-2022లో భాగంగా మరికాసేపట్లో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్.. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న రెండు దేశాల అభిమానులకు కనువిందు చేయనుంది. భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తుది జట్టులో రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీకి చోటు కల్పించారు. యజువేంద్ర చాహల్, హర్షల్ పటేల్లు ఈ మ్యాచ్లో రిజర్వ్ బెంచ్కే పరిమితం కానున్నారు.
భారత తుది జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అర్షదీప్ సింగ్.
పాకిస్థాన్ తుది జట్టు: బాబర్ అజామ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), షాన్ మసూద్, హైదర్ అలీ, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, ఇఫ్తికార్ అహ్మద్, అసిఫ్ అలీ, షాహీన్ అఫ్రిది, హరిష్ రౌఫ్, నజీమ్ షా.