హైదరాబాద్: మహిళల ప్రపంచకప్లో భాగంగా పాకిస్థాన్తో భారత్ తన తొలిమ్యాచ్ ఆడుతున్నది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న మిథాలీ సేన ఆరంభంలోనే తొలివికెట్ కోల్పోయింది. రెండో ఓవర్లో జట్టు స్కోరు 4 పరుగుల వద్ద స్టార్ బ్యాటర్ షఫాలీ వర్మ డకౌట్గా వెనుతిరిగింది. ఆరు బంతులు ఆడిన షఫాలీని రెండో ఓవర్ లాస్ట్ బాల్కు పాక్ బౌలర్ డయానా బేగ్ అవుట్ చేసింది. ప్రస్తుతం దీప్తి శర్మ (3), స్మృతి మందన (12) క్రీజ్లో ఉన్నారు. ఆరు ఓవర్లు ముగిసే సరికి భారత్ ఒక వికెట్ నష్టానికి 17 పరుగులు చేసింది.
కాగా, వన్డేల్లో పాక్పై టీమిండియా తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తున్నది. ఇప్పటివరకు ఆ జట్టుతో ఆడిన పది వన్డేల్లో భారత్ విజయం సాధించింది. ఇక మహిళల ప్రపంచకప్లోనూ ఆడిన రెండు మ్యాచ్ల్లో టీమిండియా గెలుపొందింది. కెప్టెన్ మిథాలీ రాజ్, దిగ్గజ బౌలర్ జులన్ ఘోస్వామిలకు ఇదే చివరి వరల్డ్కప్ కావడం విశేషం.