భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాగ్పూర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్.. అవుట్ఫీల్డ్ చిత్తడిగా ఉండటంతో ఆలస్యంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత జట్టు బౌలింగ్ ఎంచుకుంది. తమ జట్టులో రెండు మార్పులు ఉన్నట్లు కెప్టెన్ రోహిత్ శర్మ ప్రకటించాడు. ఉమేష్ యాదవ్ స్థానంలో జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ స్థానంలో రిషభ్ పంత్ ఆడుతున్నట్లు చెప్పాడు.
ఆసీస్ జట్టులో కూడా రెండు మార్పులు ఉన్నట్లు ఆ జట్టు సారధి ఆరోన్ ఫించ్ తెలిపాడు. గాయంతో నాథన్ ఎల్లీస్ జట్టుకు దూరమయ్యాడని, అతని స్థానంలో డానియల్ శామ్స్ ఆడతాడని చెప్పాడు. అలాగే జోష్ ఇంగ్లీస్ స్థానంలో సీన్ ఆబాట్ ఆడుతున్నాడని వెల్లడించాడు. మొహాలీ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో అద్భుతమైన విజయం సాధించిన ఆసీస్ జట్టు మూడు మ్యాచుల సిరీస్లో 1-0 ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. పోటీలో నిలవాలంటే భారత జట్టు కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ను ఇలా కుదించడం వల్ల భారత్కు ఇబ్బందేనని చెప్పాలి.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, హార్దింక్ పాండ్యా, అక్షర్ పటేల్, దినేష్ కార్తీక్, యుజ్వేంద్ర చాహల్, హర్షల్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా
ఆస్ట్రేలియా జట్టు: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), కామెరూన్ గ్రీన్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్వెల్, డానియల్ శామ్స్, మాథ్యూ వేడ్, టిమ్ డేవిడ్, ప్యాట్ కమిన్స్, సీన్ ఆబాట్, జోష్ హాజిల్వుడ్, ఆడమ్ జంపా.
India won the toss and chose to bowl first,
Jasprit Bumrah is back in the squad along with Rishabh Pant.No Umesh Yadav and Bhuvi tonight.#INDvAUS pic.twitter.com/is7rjk2wSy
— All About Cricket (@allaboutcric_) September 23, 2022