ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో దేశంలోనే అన్ని రంగాల్లో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. 29వ రాష్టంగా ఏర్పడిన తెలంగాణకు అభివృద్ధి, సంక్షేమం విషయంలో సాటి లేదని పేర్కొన్నారు. హుజూర్నగర్లో రూ.7.20 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్కు ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డితో కలిసి మంత్రి శనివారం శంకుస్ధాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ ఏడు దశాబ్దాలపాటు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఏం చేశాయో చెప్పాలని డిమాండ్ చేశారు. గుజరాత్లో పాతికేండ్లు సీఎంగా ఉన్న మోదీ ఏం అభివృద్ధి చేశారని, ప్రస్తుతం ఏ ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రంలోనైనా కోతల్లేని కరంటు అందుతుందా అని నిలదీశారు. డబ్బుతో పార్టీ పదవులు కొనుక్కున్న నాయకులు, ప్రజల్లో చెల్లుబాటు కాని నేతలు సీఎం కేసీఆర్పై నోరుపారేసుకుంటే తగిన రీతిలో తిప్పికొట్టాలని టీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. అంతకుముందు మహాశివరాత్రి సందర్భంగా మేళ్లచెర్వు జాతరలో సీనియర్ విభాగంలో ఎద్దుల పోటీలను మంత్రి ప్రారంభించారు. మేళ్లచెర్వు జాతరను ప్రభుత్వ పరంగా గుర్తించేందుకు కృషి చేస్తానని, వచ్చే ఏడాది నాటికి ఆలయం ఎదుట కోనేరు, ఎద్దుల పందేల నిర్వహణకు స్టేడియం నిర్మిస్తామని ప్రకటించారు.
మేళ్లచెర్వు, మార్చి 5 : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాల్లో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉన్నదని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మేళ్లచెర్వు స్వయం భూ శంభులింగేశ్వరస్వామి జాతరను రాష్ట్ర పండుగలా గుర్తించేందుకు కృషి చేస్తానని మంత్రి పేర్కొన్నారు. జాతరలో భాగంగా నిర్వహిస్తున్న ఎద్దుల పందేలను ఎమ్మెల్యే సైదిరెడ్డితో కలిసి శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పరమశివుడి ఆశీస్సులతో ఆలయంలో ఇప్పటికే పలు అభివృద్ధి పనులు చేపట్టామని, వచ్చే ఏడాది నాటికి కోనేరు, ఎద్దుల పందేల నిర్వహణకు స్టేడియం నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. పందేల నిర్వాహకులను, పోటీల్లో ఏపీ నుంచి కూడా పాల్గొంటున్న రైతులను మంత్రి అభినందించారు. ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడుతూ జాతరలో భాగస్వాములైన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా జూనియర్స్ విభాగంలో ఎద్దుల పందేల్లో విజేతకు మంత్రి చేతుల మీదుగా బుల్లెట్ బహూకరించారు. అంతకుముందు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు శివవిష్ణువర్ధన్శర్మ, ధనుంజయశర్మ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. ఉత్సవ కమిటీ చైర్మన్ కమతం సత్యనారాయణ, ఈఓ గుజ్జుల కొండారెడ్డి, సర్పంచ్ శంకర్రెడ్డి, హుజూర్నగర్, చింతలపాలెం ఎంపీపీలు శ్రీనివాస్, వెంకట్రెడ్డి, హుజూర్నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకట్రెడ్డి, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఇమ్రాన్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సూరిశెట్టి బసవయ్య, ఎద్దుల పందేల నిర్వాహకులు వర్రా వెంకట్రెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
సంస్థాన్ నారాయణపురం, మార్చి 5 : పేదింటి ఆడబిడ్డల కన్నీరు తుడిచిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని, మహిళాభివృద్ధికి సీఎం పెద్దపీట వేస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. శనివారం ఆయన జడ్పీ చైర్మన్ సందీప్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డితో కలిసి మండల పరిధిలోని పుట్టపాక గ్రామంలో పర్యటించారు. రూ.1.05కోట్లతో సీసీ రోడ్డు పనులు ప్రారంభించడంతో పాటు డప్పుచప్పుళ్ల మధ్య లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను స్వయంగా అందించారు. దాంతో లబ్ధిదారులు మంత్రికి బొట్టు పెట్టి స్వాగతించి శాలువాలతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలోని తెలంగాణ తల్లి, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. అనంతరం ఎస్వీఎస్ ఫంక్షన్హాల్లో నిర్వహించిన సభలో మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ నిరుపేదలు ఆడపిల్లలను భారంగా భావించవద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్ పథకాలను తీసుకువచ్చారని తెలిపారు. 104 మందికి చెక్కులు, నూతన వస్ర్తాలను అందించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి, ఆర్డీఓ సూరజ్ కుమార్, ఎంపీపీ గుత్తా ఉమాదేవి, జడ్పీటీసీ వీరమళ్ల భానుమతీగౌడ్, ఎంపీటీసీ సభ్యురాలు మర్రి వసంతా నర్సిరెడ్డి, సర్పంచ్ సామల భాస్కర్, పీఏసీఎస్ చైర్మన్ జంగారెడ్డి పాల్గొన్నారు.
హుజూర్నగర్, మార్చి 5 : అభివృద్ధి పనులు జరుగకుండా కోర్టుకు వెళ్లి అడ్డుకోవడం కాంగ్రెస్ నాయకులకు అలవాటుగా మారిందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి మండిపడ్డారు. శనివారం హుజూర్నగర్ పట్టణంలోని ఎన్ఎస్పీ క్యాంపులో రూ.7.20కోట్లతో నిర్మిస్తున్న శాకాహార, మాంసాహార మార్కెట్ దుకాణాల సముదాయానికి ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డితో కలిసి శంకుస్ధాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ అభివృద్ధి జరిగితే ప్రజలు తనను మరిచిపోతారనే అక్కసుతో ఉత్తమ్ కుమార్ కోర్టుకు వెళ్లి స్టేలు తెస్తున్నారని ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్ ప్రజల రక్తాన్ని తాగే పార్టీలని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ ఉత్తమ్ కుమార్రెడ్డి ఇసుక మాఫియా, భూ మాఫియా నడిపించి తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మానసిక స్థితి సరిగా లేక మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గెల్లి అర్చనా రవి, వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వర్రావు, ఎంపీపీ గూడెపు శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట్రెడ్డి, తాసీల్దార్ జయశ్రీ, కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, మాజీ చైర్మన్ శ్రీనివాస్, కౌన్సిలర్లు మంగమ్మ, సౌజన్య, గాయత్రి, ఓరుగంటి నాగేశ్వర్రావు, అట్లూరి మంజులా హరిబాబు, శంభయ్య, దొంతిరెడ్డి పద్మ, కవిత, దీప, నాగమణి, పుష్ప, స్వప్న పాల్గొన్నారు.