అమరావతి : విశాఖ జిల్లాలో జోరుగా గంజాయి సాగు, రవాణా జోరుగా కొనసాగుతుంది. పోలీసుల ఎత్తులకు పైఎత్తులు వేస్తున్న స్మగ్లర్లు అక్రమంగా గంజాయిని వివిధ మార్గాల్లో రవాణా చేస్తున్నారు. స్మగ్లర్లు పోలీసుల కళ్లుగప్పి చేస్తున్న గంజాయి రవాణ అనుకోని ఘటనలతో పోలీసులకు చిక్కుతున్నారు. తాజాగా జిల్లాలోని ఆనందపురం మండలం నీళ్ల కుండీలు జంక్షన్ సమీపంలో ఆగి వున్న వ్యాన్ను మరో వ్యాన్ అదుపు తప్పి ఢీకొట్టింది. దీంతో ఆగివున్న వ్యాన్ బోల్తా పడింది. బోల్తా పడిన వ్యాన్లో 57 బస్తాల్లో 2280 కిలోల గంజాయి బయటపడడంతో గంజాయి అక్రమ రవాణా వెలుగులోకి వచ్చింది.
పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు రెండుకోట్ల వరకు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. గంజాయిని తరలిస్తున్న వాహనానికి నెంబర్లు ప్లేట్ను తొలగించడంతో ఇంజిన్, చాసి నెంబర్లు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు .