హుజూరాబాద్ : హుజూరాబాద్ అభివృద్ధి కావాలంటే ప్రస్తుత ఎన్నికల్లో గెల్లు శ్రీనివాస్ ను గెలిపించాలని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి వర్యులు గంగుల కమలాకర్ పేర్కొన్నారు. సోమవారం హుజూరాబాద్ 16 డివిజన్ కు చెందిన బండ నవీన్ , బండ మనోజ్తో పాటు 50 మంది బీజేపీకి చెందిన నేతలు గంగుల కమలాకర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. పార్టీలో చేరిన వారికి మంత్రి గంగుల కమలాకర్ ,ఎస్.సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీకి రోజురోజుకీ హుజూరాబాద్ లో ఆదరణ పెరుగు తుందని ఆయన అన్నారు. హుజూరాబాద్ అభివృద్ధికి ఈటల చేసింది ఏమిలేదని…అబద్ధాలతో కాలం వెళ్లదీస్తున్నాడని.. అందుకే సెంటిమెంట్ ను రగిలిస్తున్నాడని వెల్లడించారు.. కేంద్రంలో ని బీజేపీ ప్రభుత్వం గ్యాస్ ధర పెంచి సబ్సీడీ తీసేసిం దని పేర్కొన్నారు. ఈటల రాజేందర్ కు ఏం చెప్పాలో అర్థం కాక అబద్ధాలు మాట్లాడి.. ఓట్లు సంపాదించే ప్రయత్నం చేస్తు న్నారన్నారని ఆరోపించారు. ఐదు నెలల కింద బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నల్ల చట్టాలు రద్దు చేయమని చెప్పి.. ఇప్పుడు ఎలా బీజేపీలో చేరినవు అని ఆయన ప్రశ్నించారు.
మేము హుజూరాబాద్ వచ్చి అభివృద్ధి చేస్తున్నాం.. కేంద్ర మంత్రులు వచ్చి ఖాళీ చేతులతో వెళుతున్నారని ఎద్దేవా చేశాడు. బీసీల జనగణన కోసం తీర్మానం చేసి సీఎం కేసీఆర్ కేంద్రానికి పంపారని గుర్తు చేశారు. బీజేపీలో కష్టపడి పని చేసిన నాయకులనే ఆ పార్టీ కాపాడుకోలేని పరిస్థితిలో ఉందని, రోజు రోజుకు బీజేపీ పార్టీ పై నాయకులకు నమ్మకం పోతుందని. బీజేపీ లో గెలిచి ఈటల రాజేందర్ ప్రజలను ఎలా కాపాడుకుంటారని ప్రశ్నించారు..
గెల్లు శ్రీనివాస్ గెలిచిన తర్వాత హుజూరాబాద్ కు వచ్చి.. ఇచ్చిన హామీలు పూర్తయ్యే విధంగా పని చేస్తామని హామీ ఇచ్చారు.. ఈటల రాజేందర్ మాట్లాడే మాటల్లో నీతి నిజాయితీ లేదని.. హుజూరాబాద్ ప్రజలు అలోచించాలని కోరారు. పార్టీలో చేరిన వారిలో జన్ను దామోదర్, ప్రసన్న కుమార్, టేకుమట్ల శ్రీనివాస్ , కొంగ శివ, నల్లగొండ తరుణ్, బండ సాయి కుమార్, గందే మహేష్ , బోనాల శ్రీకాంత్ లు ఉన్నారు..