న్యూయార్క్ : ఇకపై న్యూయార్క్లో దీపావళి రోజును సెలవుదినంగా పరిగణిస్తారు. ఈ మేరకు ఒక బిల్లను న్యూయార్క్ అసెంబ్లీ ఆమోదించనున్నది. దీంతో ఎంపైర్ స్టేట్ భవనం దీపావళికి దీపాలతో ప్రకాశించనున్నది. గత కొంతకాలంగా దీపావళి పండుగను సెలవుగా ప్రకటించాలనే డిమాండ్ ప్రభుత్వానికి వస్తున్నది. న్యూయార్క్ అసెంబ్లీలో భారత సంతతికి చెందిన తొలి మహిళా సభ్యురాలు రాజకుమారి ఈ బిల్లును ప్రవేశపెట్టారు.
ఇదే విధమైన బిల్లును రాష్ట్ర స్థాయిలో న్యూయార్క్ స్టేట్ సెనేటర్ కెవిన్ థామస్ ప్రవేశపెట్టారు. కెవిన్ రాష్ట్రంలో భారత సంతతికి చెందిన ఏకైక సెనేటర్. బిల్లు ఆమోదించిన తర్వాత దీపావళి రోజున మొత్తం అమెరికాలో సెలవుదినంగా ప్రకటిస్తారు. ఈసారి న్యూయార్క్లోని ఐకానిక్ ఎంపైర్ స్టేట్ భవనం దీపావళి రంగులతో మెరువనున్నది.
దీపావళిని ఇప్పటికే వైట్ హౌస్ పండుగగా గుర్తించింది. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన వారసుడు డొనాల్డ్ ట్రంప్ ఇద్దరూ వైట్ హౌస్లో దీపాలు వెలిగించి దీపావళిని జరుపుకున్నారు. 2016 లో దీపావళికి తపాలా బిళ్ళను కూడా అమెరికా విడుదల చేసింది.
న్యూయార్క్లో దాదాపు 7 లక్షలకు పైగా భారతీయులు ఉన్నారు. ఇతర రాష్ట్రాలు సాధారణంగా న్యూయార్క్ చేసే వాటిని అనుసరిస్తాయి. అందువల్ల, న్యూజెర్సీ, పెన్సిల్వేనియా వంటి అనేక రాష్ట్రాలు కూడా దీపావళి సెలవు ప్రకటించడాన్ని పరిశీలిస్తున్నాయి.
వచ్చే నవంబర్లో బంగ్లాదేశ్లో టీమిండియా పర్యటన
ముగిసిన ఎల్టీటీఈ శకం.. చరిత్రలో ఈరోజు
నితీష్జీ.. నా కోసం పెండ్లిళ్లపై నిషేధం విధించరూ..?!
కరోనా ముప్పు దృష్ట్యా పాఠశాలల మూసివేతకు నిర్ణయం
ప్రయాణ పరిమితులను తొలగించిన సౌదీ అరేబియా
వచ్చే ఏడాదికల్లా మార్కెట్లోకి హీరో ఎలక్ట్రిక్ బైక్
అధిక రక్తపోటు.. చేయాల్సినవి.. చేయకూడనివి
భద్రంగా అజ్మీర్లోని ఇజ్రాయెల్ మందిరం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..