శామీర్పేట, నవంబర్ 19 : భూసార పరీక్షలతో భూమిలో పోషకాల లభ్యత, లోపాలు గుర్తిస్తే పెట్టుబడి తగ్గుతుందని మేడ్చల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రవియాదవ్ తెలిపారు. శామీర్పేట మండలం పొన్నాల్ గ్రామంలో భూసార పరీక్షల క్షేత్ర దినం సందర్భంగా రైతులకు భూసార పరీక్షా పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ భూసార పరీక్షలతో భూమిలోని పోషక విలువలను గుర్తించి కావాల్సిన ఎరువులను తగిన మోతాదులో వాడుకోవచ్చని తెలిపారు. దీంతో పెట్టుబడి తగ్గడంతో పాటు అనవసరమైన రసాయన ఎరువుల ఉపయోగం తగ్గుతుందన్నారు. ప్రతి ఒక్క రైతు భూసార పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏడీఏ వెంకట్రాంరెడ్డి, జడ్పీటీసీ అనిత లాలయ్య, ఏవో రమేశ్, సర్పంచ్ సుకన్య, ఏఎంసీ వైస్ చైర్మన్ శ్రీకాంత్రెడ్డి, డైరెక్టర్లు అజయలక్ష్మి, మాధవి, ఏఈవో రవి, రైతులు నారాయణరెడ్డి, ప్రభాకర్, రత్నం, రాఘవరెడ్డి, లక్ష్మీకాంత్రెడ్డి, సతీశ్రెడ్డి, రమేశ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.