శంషాబాద్ రూరల్:దళిత బంధు పథకం దేశానికే ఆదర్శమని చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజీత్రెడ్డి అన్నారు. గురువారం శంషాబాద్ మండలంలోని కవ్వగూడ గ్రామ సర్పంచ్ రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు చేవెళ్ల ఎంపీ ఇంటికి వెళ్లారు. అక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్గారి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజీత్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా అమలు చేస్తున్న దళితబంధు పథకం దేశానికే ఆదర్శమని కొనియాడారు.
తెలంగాణలోని దళితులు ఆర్థికంగా వెనుకబడి అనేక ఇబ్బందులు పడుతున్నట్లు తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు రావడంతో ఆయన దళితుల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో ఆర్థమౌతుందన్నారు. కార్యక్రమంలో కవ్వగూడ గ్రామ టీఆర్ఎస్ నాయకులు అనిల్గౌడ్, సురేష్ ముదిరాజ్లతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.