Hyundai | దక్షిణ కొరియా ఆటో దిగ్గజం హ్యుండాయ్ మోటార్ గ్రూప్.. భారత్లో ఏటా 15 లక్షల యూనిట్ల కార్లు ఉత్పత్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది. భారత్లో హ్యుండాయ్, కియా ఇండియా మోడల్ కార్ల ఉత్పత్తి పెంచాలని నిర్ణయించినట్లు హ్యుండాయ్ మోటార్ గ్రూప్ ప్రతినిధి యుయిసున్ చుంగ్ చెప్పారు. తమ కంపెనీ మరిన్ని ఈవీ కార్లను విడుదల చేయాలని యోచిస్తున్నదన్నారు. భారత్లో తయారయ్యే కార్లను పొరుగు దేశాలకు ఎగుమతి చేయాలని యోచిస్తున్నట్లు తెలిపారు.
గతేడాది జనరల్ మోటార్స్ నుంచి కొనుగోలు చేసిన ఫుణె ప్లాంట్ నుంచి ఈ ఏడాది ద్వితీయార్థంలో ఉత్పత్తి ప్రారంభించనున్నది. ఈ యూనిట్ లో ఏ కంపెనీ అయినా ఏటా రెండు లక్షల కంటే ఎక్కువ కార్లు తయారు చేయగల సామర్థ్యం ఉంటది. చెన్నై హ్యుండాయ్ యూనిట్ కలుపుకుంటే ఏటా 10 లక్షల పై చిలుకు కార్లను ఉత్పత్తి చేస్తుంది. కియా ఇండియా కార్ల ఉత్పత్తి 4.31 లక్షల యూనిట్లకు పెంచడానికి ప్లాన్ రూపొందించింది. దీంతో భారత్ లో సుమారు 15 లక్షల యూనిట్ల కార్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంటుందని పేర్కొంది.