కుమ్రం భీం ఆసిఫాబాద్ : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో(Asifabad district) సివిల్ సప్లై అధికారులు(Civil supply official) భారీగా రేషన్ బియ్యాన్ని(Ration rice) పట్టుకున్నారు. పేదలకు పంపిణీ చేయాల్సిన బియ్యా న్ని పక్కదారి పట్టిస్తున్నారనే సమాచారం మేరకు కాగజ్నగర్ మండలంలో చింతగూడ కోయవాగు వద్ద దాడులు నిర్వహించారు.
మహారాష్ట్రకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న సుమారు 122 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. ఐచర్ వ్యాన్ను స్వాధీనం చేసకొని సయ్యద్ అరిఫ్, ఇషాక్ అహ్మద్లపై కేసు నమోదు చేశారు. పట్టుబడిన బియ్యాన్ని సివిల్ సప్లై గోదాంకి తరలించారు. రేషన్ బియ్యాన్ని ఎవరైనా అమ్మినా, కొనుగోలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.