హైదరాబాద్ : మండు వేసవిలో కురిసిన ఒక్క వర్షానికే నగరం అతులాకుతలమైంది. నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. వేర్వేరు ప్రాంతాల్లో 10 మంది మృత్యువాత పడ్డారు. మంగళవారం వర్షం వస్తుందని వాతా వారణ శాఖ ముందే సూచనలు చేసినా.. అప్రమత్తంగా ఉండాల్సిన అధికార యంత్రాంగం నిద్రావస్థలో ఉన్నది. ఫలితం మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
కాగా, బాచుపల్లిలోని(Bachupally) రేణుక ఎల్లమ్మ కాలనీలో నిర్మాణంలో ఉన్న అపార్టుమెంట్ గోడ కూలి( Apartment wall collapse) ఏడుగురు దుర్మరణం పాలైన ఘటనలో ఆరుగురిని పోలీసులు అరెస్ట్(Arrested) చేశారు. భనవ నిర్మాణదారుడు అరవింద్ రెడ్డి, సైట్ ఇంజినీర్ సతీష్, ప్రాజెక్ట్ మేనేజర్ ఫ్రాన్సిస్, కాంట్రాక్టర్ఖ రాజేష్ మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరిని కోర్టులో హాజరుపరచనున్నారు.
కాగా, ఇక్కడ సహాయక చర్యల్లో జాప్యం కావడంతో మృతుల సంఖ్య పెరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరో ఘటనలో బేగంపేట నాలాలో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. బహదూర్పురలో విద్యుదాఘా తంతో ఓ యువకుడు చనిపోయాడు. ఇలా హైదరాబాద్లో ఒక్కరోజే కురిసిన ఒక్కవానకే నిండు ప్రాణాలు పోవడం ఆందోళన కలిగిస్తున్నది.