Hyderabad | తెలుగు రాష్ట్రాల్లో ఉగ్ర లింకులు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే విజయవాడలో ముగ్గురు యువకులను అరెస్టు చేయగా.. తాజాగా వారిని ఉగ్రవాదం వైపు ప్రోత్సహించిన హైదరాబాద్కు చెందిన యువతిని కూడా అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ చంచల్గూడకు చెందిన సయిదా బేగంను కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం విచారణ నిమిత్తం ఆమెను విజయవాడకు తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విదేశీ హ్యాండ్లర్ అల్ హకీమ్ షుకూర్ సూచనలతో సయిదా బేగం పనిచేస్తుంది. ఈ క్రమంలోనే విజయవాడకు చెందని సోహైల్ బెగ్, షరీఫ్, డానిష్ యువకులను తీవ్రవాద సంస్థల వైపు మళ్లించడంలో ఆమె కీలక పాత్ర పోషించిందని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్ మల్లేపల్లి ప్రాంతానికి చెందిన మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.