హైదరాబాద్ : భూగర్భ జలాల వినియోగంలో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. రాజన్న సిరిసిల్ల, జనగాం జిల్లాలు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. 2019-20 సంవత్సరానికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భూగర్భ జలాల బోర్డులు సంయుక్తంగా నిర్వహించిన భూగర్భ జల వనరుల అంచనాలో ఈ విషయం వెల్లడైంది.
హైదరాబాద్, రాజన్న సిరిసిల్ల, జనగామ, రంగారెడ్డి, మహబూబ్నగర్, నిజామాబాద్ జిల్లాలు అత్యధికంగా భూగర్భ జలాలను వినియోగించిన జిల్లాలుగా నివేదికలో తేలింది. జగిత్యాల, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, నాగర్కర్నూల్, మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి, సిద్దిపేట జిల్లాలు ఓ మోస్తరుగా భూగర్భ జలాలను వినియోగించాయి. మిగతా జిల్లాలు భూగర్భ జలాలను అతి స్వల్పంగా వినియోగించినట్లు నివేదికలో పేర్కొన్నారు.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ 97 శాతం గ్రౌండ్ వాటర్ను వినియోగించగా, రాజన్న సిరిసిల్ల జిల్లా 79 శాతం, జనగామ జిల్లా 78 శాతం భూగర్భ జలాలను వినియోగించాయి. రంగారెడ్డి జిల్లాలో 74 శాతం, మహబూబ్నగర్ జిల్లాలో 72 శాతం, నిజామాబాద్ జిల్లాలో 70 శాతం గ్రౌండ్ వాటర్ను వాడుకున్నారు.