కీసర, సెప్టెంబర్ 30 : తెలంగాణ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీలకు చెందిన వారు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. మండల పరిధి భోగారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, మహిళలు సుమారు 40మంది శుక్రవారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో వారికి కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ హయాంలో గత 8 ఏండ్ల నుంచి రాష్ట్రంలో కోట్లాది రూపాయలతో అనేక రకాల అభివృద్ధి పనులు జరుగుతున్నాయిని, తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి ప్రపంచ దేశాలకు ఆదర్శం అవుతున్నదన్నారు.
దేశంలో ఉన్న రైతాంగం, వివిధ వర్గాలకు చెందిన వారు సీఎం కేసీఆర్ను దేశానికి ప్రాతినిత్యం వహించాలని కోరుతున్నారన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలకు సముచిత న్యాయం జరుగుతుందని, రాష్ట్ర ప్రభుత్వ హయాంలో జరుగుతున్న ప్రతి పథకం అన్ని వర్గాలకు, ప్రతి ఇంటికి చేరుతున్నదన్నారు. అందుకే అటు కాంగ్రెస్, ఇటు బీజేపీలకు నిద్ర పట్టడంలేదని, వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీలకు భవిష్యత్ ఉండదని మంత్రి తెలిపారు.
మేడ్చల్ నియోజకవర్గంలో ప్రభుత్వం నుంచి ప్రతి ఇంటికి ఏదో ఒక రకంగా లబ్ధి చేకూరిందన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో మన రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రగామీగా ముందుకు దూసుకెళ్తుందన్నారు. వచ్చే దసరా రోజు సీఎం కేసీఆర్ జాతీయ స్థాయిలో పెట్టే పార్టీని ప్రకటిస్తున్నారన్నారు. దేశంలో అన్ని ఏరియాల వారు సీఎం పెట్టే జాతీయ పార్టీని కూడా స్వాగతించడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బెస్త వెంకటేశ్, కీసర ఎంపీపీ మల్లారపు ఇందిరలక్ష్మీనారాయణ, మండల పార్టీ అధ్యక్షుడు జలాల్పురం సుధాకర్రెడ్డి, భోగారం కోఆప్షన్ సభ్యులు డబ్బి నర్సింహ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు మల్లారపు లక్ష్మీనారాయణగౌడ్లతో పాటు పలు గ్రామాలకు చెందిన టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.