పెద్దశంకరంపేట, ఏప్రిల్ 25: మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో శుక్రవారం నిర్వహించనున్న సీఎం రేవంత్రెడ్డి బహిరంగ సభకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్షెట్కార్కు మద్దతుగా నిర్వహించే సభలో ఆయన పాల్గొననున్నారు. పెద్దశంకరంపేటలోని పద్మయ్య ఫంక్షన్హాల్ సమీపంలోని ఖాళీ ప్రదేశాన్ని ఎంపిక చేశారు.
ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా సీఎం సభను తిలకించడానికి చుట్టూ ప్రత్యేక రేలింగ్ను ఏర్పాట్లు చేశారు. గురువారం రాత్రి పోలీస్ బృందం డాగ్స్కాడ్తో సభా ప్రాంగణాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. సభా ఏర్పాట్లను మంత్రి దామోదర రాజనర్సింహ, ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, ఎంపీ అభ్యర్థి సురేశ్షెట్కార్ పరిశీలించారు.