గౌతంనగర్/అల్వాల్, సెప్టెంబర్30: దేవీ శరన్నవరాత్రి వేడుకల సందర్భంగా శుక్రవారం సంతోష్నగర్ అంబ భవాని ఆలయం, మల్లికార్జునగర్, ఆర్కేనగర్లలో ఏర్పాటు చేసిన అమ్మవారిని గౌతంనగర్ డివిజన్ కార్పొరేటర్ మేకల సునీతా రాముయాదవ్ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. మౌలాలి డివిజన్ పరిధి గాయత్రినగర్లోని గాయత్రిదేవి దేవాలయంలో అమ్మవారికి సామూహిక కుంకుమార్చన చేశారు. గాయత్రిదేవి లక్ష్మిదేవి రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చింది. ఈ కార్యక్రమంలో గాయత్రిదేవి దేవాలయ అధ్యక్షుడు జీ.రాజేందర్రావు, ఉపాధ్యక్షులు బి.పాములు, సెక్రటరీ డి.కృష్ణారెడ్డి, జాయింట్ సెక్రటరీ డి.శ్రీనివాస్రెడ్డి, జే.స్వామి, కోశాధికారి ఎస్.రాంచద్రన్ నాయర్, టీ.ప్రదీప్రెడ్డి, కమిటీ సభ్యులు, నిర్వహకులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
అల్వాల్ వేంకటేశ్వరస్వామి మండపంలో నెలకొల్పిన దుర్గామాత శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం భక్తులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమలో చెట్ల రవి, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.